పెద్దల పాదాలకు నమస్కారం చేయడం అనేది మన సంస్కృతి. ఇక ఇది రాజకీయాలు, సినీ రంగం.. వంటి పలు రంగాలకు ఎగబాకింది. కానీ, జిల్లాలకు అధికారులు అయిన కలెక్టర్లు సీఎంల కాళ్లకు నమస్కారం చేయడం అనేది ఉండదు. కానీ, తెలంగాణలో మాత్రం తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్ భవనాల ప్రారంభం సందర్భంగా ఆ జిల్లాల కలెక్టర్లు వెంకట్రామారెడ్డి, శరత్.. సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్లను వారి చాంబర్లోని సీట్లో కూర్చోబెట్టగా.. వారు సీఎం పాదాలకు నమస్కరించారు.
పాదాలకు నమస్కారం చేయడంపై కలెక్టర్ల చర్య విమర్శల పాలైంది. ఐఏఎస్ అధికారులై ఉండి.. ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించడమేంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్తువెత్తాయి. దీంతో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఈ విమర్శలపై వివరణ ఇచ్చారు. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమన్నారు. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ అధికారిగా, నూతన కలెక్టరేట్లో తనకు భాధ్యతలు అప్పగించి ఆశీర్వదిస్తున్న క్రమంలో తండ్రి సమానుడైన సీఎం నుంచి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
అయితే.. ఈ విషయంపై మాత్రం రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. కేసీఆర్.. ఇదంతా కావాలనే చేశారంటూ.. కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు ఇలా చేయించారని.. దుయ్యబడుతున్నారు. మరికొందరు సదరు అధికారులు.. త్వరలోనే వీఆర్ ఎస్ తీసుకుని.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారేమో.. అంటూ పెదవి విరుస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటివివరణా లేక పోవడం గమనార్హం. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎటు దారితీస్తుందో చూడాలి.
This post was last modified on June 21, 2021 1:57 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…