Political News

సౌత్ రూట్లో చిరాగ్ – సంచలన నిర్ణయం

బీహార్ ప్రజల మద్దతు కోరుతూ ఎల్జేపీ కీలక నేత చిరాగా పాశ్వాన్ ‘ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర మాజీమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత పార్టీ నిలువుగా చీలిపోయిన విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షడు, ఎంపి అయిన చిరాగ్ ను స్వయంగా బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పదవిలో నుండి దింపేసిన విషయం తెలిసిందే. పదవిలో నుండి దింపటంతో సరిపెట్టుకోకుండా ఏకంగా పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు.

పార్టీలో హఠాత్తుగా సంభవించిన పరిణామాలతో చిరాగ్ కు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో పార్టీ మీద ఆధిపత్యం తమదంటే తమదంటు రెండు వర్గాలు రోడ్డెక్కాయి. చివరకు ఈ వివాదం ఒకవైపు కేంద్ర ఎన్నికల కమీషన్ ముందుకు చేరింది. ఇదే సమయంలో లోక్ సభ స్పీకర్ కు కూడా రెండువర్గాలు ఒకదానిపై ఇంకోటి ఫిర్యాదులు చేసుకున్నాయి. మరి ఈ వివాదాన్ని ఎన్నికల కమీషన్ , లోక్ సభ స్పీకర్ ఏ విధంగా పరిష్కారనే విషయం ఆసక్తిగా మారింది.

ఈ వివాదాలు ఇలావుండగానే ప్రజల మద్దతు కోరుతు చిరాగ్ పాదయాత్రను ప్రకటించేశారు. తన తండ్రి రామ్ విలాస్ జయంతి అయిన జూలై 5వ తేదీన హాజీపూర్ నుండి పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంటే పార్టీ కోసం బాబాయ్ వర్గంతో గొడవపడి ఉపయోగం లేదని అర్ధమైనట్లుంది. అందుకనే నేరుగా ప్రజల మద్దతుతోనే పార్టీని తిరిగి సొంతం చేసుకునేందుకు చిరాగ్ ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది.

చిరాగ్ కు ఇలాంటి పరిస్ధితి రావటానికి స్వయంకృతమే అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. రామ్ విలాస్ ఉన్నపుడు పార్టీలోని కీలక నేతలతో మంతనాలు జరిపి నిర్ణయం తీసుకునేవారు. కానీ చిరాగ్ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్డీయేలో ఉంటూనే మరో భాగస్వామ్య పార్టీ జేడీఎస్ కు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను పోటీలోకి దింపారు. పోటీవద్దని నేతలు ఎంతచెప్పినా చిరాగ్ వినలేదు. ఇలాంటి అనేక ఒంటెత్తుపోకడల కారణంగానే పార్టీ చీలిపోయింది. మరి జనాలు ఎవరికి మద్దతిస్తారో చూడాల్సిందే.

This post was last modified on June 21, 2021 1:20 pm

Share

Recent Posts

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

46 minutes ago

మెలోడీ బ్రహ్మ మళ్ళీ రేసులోకి వచ్చినట్టే

ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…

1 hour ago

సంచలనం: కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…

2 hours ago

అఖిల్ కొడుకుతో సిసింద్రీ-2

‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…

2 hours ago

మోడీకి క‌ళ్లు చెదిరేలా స్వాగ‌త ఏర్పాట్లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో వారంలో ఏపీకి రానున్నారు. ఆగ‌స్టు 1వ తేదీన ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురానికి…

2 hours ago

రాళ్లను మెట్లుగా మార్చి.. అదే మోదీ ప్రత్యేకత..!

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…

4 hours ago