Political News

సౌత్ రూట్లో చిరాగ్ – సంచలన నిర్ణయం

బీహార్ ప్రజల మద్దతు కోరుతూ ఎల్జేపీ కీలక నేత చిరాగా పాశ్వాన్ ‘ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర మాజీమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత పార్టీ నిలువుగా చీలిపోయిన విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షడు, ఎంపి అయిన చిరాగ్ ను స్వయంగా బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పదవిలో నుండి దింపేసిన విషయం తెలిసిందే. పదవిలో నుండి దింపటంతో సరిపెట్టుకోకుండా ఏకంగా పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు.

పార్టీలో హఠాత్తుగా సంభవించిన పరిణామాలతో చిరాగ్ కు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో పార్టీ మీద ఆధిపత్యం తమదంటే తమదంటు రెండు వర్గాలు రోడ్డెక్కాయి. చివరకు ఈ వివాదం ఒకవైపు కేంద్ర ఎన్నికల కమీషన్ ముందుకు చేరింది. ఇదే సమయంలో లోక్ సభ స్పీకర్ కు కూడా రెండువర్గాలు ఒకదానిపై ఇంకోటి ఫిర్యాదులు చేసుకున్నాయి. మరి ఈ వివాదాన్ని ఎన్నికల కమీషన్ , లోక్ సభ స్పీకర్ ఏ విధంగా పరిష్కారనే విషయం ఆసక్తిగా మారింది.

ఈ వివాదాలు ఇలావుండగానే ప్రజల మద్దతు కోరుతు చిరాగ్ పాదయాత్రను ప్రకటించేశారు. తన తండ్రి రామ్ విలాస్ జయంతి అయిన జూలై 5వ తేదీన హాజీపూర్ నుండి పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంటే పార్టీ కోసం బాబాయ్ వర్గంతో గొడవపడి ఉపయోగం లేదని అర్ధమైనట్లుంది. అందుకనే నేరుగా ప్రజల మద్దతుతోనే పార్టీని తిరిగి సొంతం చేసుకునేందుకు చిరాగ్ ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది.

చిరాగ్ కు ఇలాంటి పరిస్ధితి రావటానికి స్వయంకృతమే అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. రామ్ విలాస్ ఉన్నపుడు పార్టీలోని కీలక నేతలతో మంతనాలు జరిపి నిర్ణయం తీసుకునేవారు. కానీ చిరాగ్ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్డీయేలో ఉంటూనే మరో భాగస్వామ్య పార్టీ జేడీఎస్ కు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను పోటీలోకి దింపారు. పోటీవద్దని నేతలు ఎంతచెప్పినా చిరాగ్ వినలేదు. ఇలాంటి అనేక ఒంటెత్తుపోకడల కారణంగానే పార్టీ చీలిపోయింది. మరి జనాలు ఎవరికి మద్దతిస్తారో చూడాల్సిందే.

This post was last modified on June 21, 2021 1:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

38 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago