ఏపీలో అధికారం కోల్పోయాక విలవిల్లాడుతోన్న తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీలో మైనార్టీ నేతలు ఎవ్వరూ ఉండడం లేదు. విచిత్రం ఏంటంటే అసలు మైనార్టీలు ఎవ్వరూ టీడీపీ వెనక ఉండడం లేదన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో బలవంతంగా పార్టీలో కొనసాగిన కొందరు నేతలు ఇప్పుడు పార్టీ నుంచి ఎప్పుడు బయటకు వద్దామా ? అన్న ఆలోచనలో ఉన్నారు. అసలు మైనార్టీ ఓటర్లు పార్టీకి ఎప్పటి నుంచో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వీరంతా వన్ సైడ్గా జగన్ కు ఓట్లేశారు.
ఇక మైనార్టీ నేతల్లో కూడా చంద్రబాబుపై నమ్మకం పోయింది. అందుకే గత ఎన్నికల తర్వాత ఎవరికి వారు తమ దారులు తాము చూసుకుంటున్నారు. తాజాగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ గతకొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఈ విషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హైలెట్ అవుతోంది. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని… ఇప్పటికే టీడీపీ లో మైనారిటీ నేతల వాయిస్ మూగబోయిన నేపథ్యంలో ఫరూక్ కు చంద్రబాబు గట్టిగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చినట్టు వినికిడి. అయినా ఆయన పార్టీలో ఉన్నారో ? లేదో ? కూడా తెలియడం లేదు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ఎండీ ఫరూక్ టీడీపీలోనే ఉన్నారు. రాయలసీమలో మైనారిటీ నేతగా ఎన్ఎండీ ఫరూక్ కు మంచి గుర్తింపే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి.. శాసనమండలి ఛైర్మన ను చేశారు. ఆ తర్వాత మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా.. ఆయన పేరుకు మాత్రమే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మౌనంగా ఉండడంతో బాబు క్లాస్ పీకగా.. ఆయన బాబును లైట్ తీస్కొన్నట్టు వినికిడి. ఏదేమైనా ఫరూక్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో ? కూడా తెలియని పరిస్థితి.
This post was last modified on June 21, 2021 10:56 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…