ఏపీలో అధికారం కోల్పోయాక విలవిల్లాడుతోన్న తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీలో మైనార్టీ నేతలు ఎవ్వరూ ఉండడం లేదు. విచిత్రం ఏంటంటే అసలు మైనార్టీలు ఎవ్వరూ టీడీపీ వెనక ఉండడం లేదన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో బలవంతంగా పార్టీలో కొనసాగిన కొందరు నేతలు ఇప్పుడు పార్టీ నుంచి ఎప్పుడు బయటకు వద్దామా ? అన్న ఆలోచనలో ఉన్నారు. అసలు మైనార్టీ ఓటర్లు పార్టీకి ఎప్పటి నుంచో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వీరంతా వన్ సైడ్గా జగన్ కు ఓట్లేశారు.
ఇక మైనార్టీ నేతల్లో కూడా చంద్రబాబుపై నమ్మకం పోయింది. అందుకే గత ఎన్నికల తర్వాత ఎవరికి వారు తమ దారులు తాము చూసుకుంటున్నారు. తాజాగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ గతకొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఈ విషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హైలెట్ అవుతోంది. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని… ఇప్పటికే టీడీపీ లో మైనారిటీ నేతల వాయిస్ మూగబోయిన నేపథ్యంలో ఫరూక్ కు చంద్రబాబు గట్టిగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చినట్టు వినికిడి. అయినా ఆయన పార్టీలో ఉన్నారో ? లేదో ? కూడా తెలియడం లేదు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ఎండీ ఫరూక్ టీడీపీలోనే ఉన్నారు. రాయలసీమలో మైనారిటీ నేతగా ఎన్ఎండీ ఫరూక్ కు మంచి గుర్తింపే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి.. శాసనమండలి ఛైర్మన ను చేశారు. ఆ తర్వాత మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా.. ఆయన పేరుకు మాత్రమే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మౌనంగా ఉండడంతో బాబు క్లాస్ పీకగా.. ఆయన బాబును లైట్ తీస్కొన్నట్టు వినికిడి. ఏదేమైనా ఫరూక్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో ? కూడా తెలియని పరిస్థితి.
This post was last modified on June 21, 2021 10:56 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…