Political News

హెచ్ సీఏ ఇష్యూలో కవితపై అజరుద్దీన్ ఏమన్నారు?


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో చోటు చేసుకున్న తగదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. హెచ్ సీఏకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మహ్మద్ అజరుద్దీన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయటంతో పాటు.. అతడి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన అపెక్స్ కౌన్సిల్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తనకు నోటీసులు ఇవ్వటంపై అజారుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ సీఏ మీద ఎమ్మెల్సీ కవిత కన్నేశారని.. అందులో భాగంగానే అజారుద్దీన్ కు పొగ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్ కు హెచ్ సీయూ అధ్యక్షుడిగా ఉన్న తనపై చర్యలు తీసుకునే అధికారం లేదని అజార్ మండిపడుతున్నారు. ఒకవేళ ప్రస్తుత కార్యవర్గాన్ని అంబుడ్స్ మెన్ రద్దు చేస్తే.. మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయటానికి తాను సిద్ధమేనని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

తనపై ఆరోపణలు చేస్తున్న ఐదుగురు కార్యవర్గ సభ్యులే హెచ్ సీఏలో జరిగిన పలు అవినీతి పనులకు సూత్రధారులని.. రోజు ఏసీబీ కోర్టుల చుట్టూ తిరిగేటోళ్లు తనపై ఆరోపణలు చేయటం కామెడీగా ఉందన్నారు. తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ బ్లాక్ మొయిలింగ్ కు పాల్పడుతున్నట్లు చెప్పారు. కానీ.. వారి బెదిరింపులకు తాను లొంగనని.. ప్రస్తుత వివాదంపై బీసీసీఐకి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. హెచ్ సీఏలోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇచ్చేందుకే ఇదంతా జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో కవిత సంఘంలోకి రానున్నారు కదా? అన్న ప్రశ్నకు అజార్ స్పందించారు. కవిత విషయం తనకు తెలీదని.. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది తన ఇష్టమని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. హెచ్ సీఏ గాడి తప్పినట్లుగా ఇటీవల కవిత చేసిన విమర్శలు తన వరకు రాలేదన్నారు. చూస్తుంటే.. కవిత గురించి ఒక్క నెగిటివ్ మాట మాట్లాడటానికి అజారుద్దీన్ సిద్ధంగా లేరన్న విషయం ఆయన మాటలతో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on June 18, 2021 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

27 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago