హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో చోటు చేసుకున్న తగదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. హెచ్ సీఏకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మహ్మద్ అజరుద్దీన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయటంతో పాటు.. అతడి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన అపెక్స్ కౌన్సిల్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తనకు నోటీసులు ఇవ్వటంపై అజారుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హెచ్ సీఏ మీద ఎమ్మెల్సీ కవిత కన్నేశారని.. అందులో భాగంగానే అజారుద్దీన్ కు పొగ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్ కు హెచ్ సీయూ అధ్యక్షుడిగా ఉన్న తనపై చర్యలు తీసుకునే అధికారం లేదని అజార్ మండిపడుతున్నారు. ఒకవేళ ప్రస్తుత కార్యవర్గాన్ని అంబుడ్స్ మెన్ రద్దు చేస్తే.. మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయటానికి తాను సిద్ధమేనని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
తనపై ఆరోపణలు చేస్తున్న ఐదుగురు కార్యవర్గ సభ్యులే హెచ్ సీఏలో జరిగిన పలు అవినీతి పనులకు సూత్రధారులని.. రోజు ఏసీబీ కోర్టుల చుట్టూ తిరిగేటోళ్లు తనపై ఆరోపణలు చేయటం కామెడీగా ఉందన్నారు. తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ బ్లాక్ మొయిలింగ్ కు పాల్పడుతున్నట్లు చెప్పారు. కానీ.. వారి బెదిరింపులకు తాను లొంగనని.. ప్రస్తుత వివాదంపై బీసీసీఐకి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. హెచ్ సీఏలోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇచ్చేందుకే ఇదంతా జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో కవిత సంఘంలోకి రానున్నారు కదా? అన్న ప్రశ్నకు అజార్ స్పందించారు. కవిత విషయం తనకు తెలీదని.. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది తన ఇష్టమని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. హెచ్ సీఏ గాడి తప్పినట్లుగా ఇటీవల కవిత చేసిన విమర్శలు తన వరకు రాలేదన్నారు. చూస్తుంటే.. కవిత గురించి ఒక్క నెగిటివ్ మాట మాట్లాడటానికి అజారుద్దీన్ సిద్ధంగా లేరన్న విషయం ఆయన మాటలతో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 18, 2021 11:05 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…