Political News

మోదీపై కేసీఆర్ ఫైరింగ్… ప్యాకేజీపై సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తనదైన రేంజిలో ఫైర్ అయ్యారు. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో రెండో భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై గడచిన రెండు, మూడు రోజులుగా సైలెంట్ గానే ఉన్న కేసీఆర్…సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కేంద్రంపైనా, మోదీ విధానాలపైనా కేసీఆర్ తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటిదాకా పెద్దగా విమర్శలేమీ చేయని కేసీఆర్.. ఈ సారి మాత్రం తనదైన రేంజిలో మోదీ సర్కారును కడిగిపారేశారనే చెప్పాలి.

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని భోగస్ ప్యాకేజీగా కేసీఆర్ అభివర్ణించారు. మోదీ సర్కారు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫ్యూడల్ విధానంలో భాగంగా ఉందని, ఫెడరల్ రాజ్యమైన భారత్ లో అది ఎలా అతుకుతుందని కూడా కేసీఆర్ ప్రకటించారు. మోదీ సర్కారు ప్రకటించిన ప్యాకేజీని విపక్షాలే కాకుండా విదేశాలు కూడా తూర్పారబడుతున్నాయని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయినా ఈ ప్యాకేజీలో కేంద్రం తనదైన ఫ్యూడల్ వైఖరిని బయటపెట్టుకుని తన పరువును తానే తీసుకుందని కూడా కేసీఆర్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ప్యాకేజీలో దేశంలోని రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ సర్కారు బిక్షగాళ్లలా చూసిందని కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కేంద్రం ప్యాకేజీ… ఓ దుర్మార్గపు ప్యాకేజీనేనని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

అయినా కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరుకున్నది ఫ్యూడల్ తరహా ప్యాకేజీ కానే కాదని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు వచ్చేలా ప్యాకేజీలు ఉండాలని భావించామని, అయితే అందుకు విరుద్ధంగా నరేంద్ర మోదీ సర్కారు ఫ్యూడల్ భావజాలమున్న ప్యాకేజీని ప్రకటించిందని కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని అన్ని వ్యవస్థలు ప్రైవేట్ పరం కాక తప్పదని కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల నుంచి కేంద్రం సెస్ ల రూపంలో పన్నులు వసూలు చేస్తోందని, కేంద్రం అవలంబిస్తున్న ఈ వైఖరితో రాష్ట్రాలు మునిగిపోక తప్పదని కూడా కేసీఆర్ హెచ్చరించారు. మొత్తంగా మొన్నటిదాకా మోదీ సర్కారును ఏమీ అనని కేసీఆర్… ఇప్పుడు ఏకంగా మోదీ సర్కారుపై ఓ రేంజిలో విరుచుకుపడటం నిజంగానే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి.

This post was last modified on May 18, 2020 9:31 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago