టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తనదైన రేంజిలో ఫైర్ అయ్యారు. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో రెండో భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై గడచిన రెండు, మూడు రోజులుగా సైలెంట్ గానే ఉన్న కేసీఆర్…సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కేంద్రంపైనా, మోదీ విధానాలపైనా కేసీఆర్ తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటిదాకా పెద్దగా విమర్శలేమీ చేయని కేసీఆర్.. ఈ సారి మాత్రం తనదైన రేంజిలో మోదీ సర్కారును కడిగిపారేశారనే చెప్పాలి.
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని భోగస్ ప్యాకేజీగా కేసీఆర్ అభివర్ణించారు. మోదీ సర్కారు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫ్యూడల్ విధానంలో భాగంగా ఉందని, ఫెడరల్ రాజ్యమైన భారత్ లో అది ఎలా అతుకుతుందని కూడా కేసీఆర్ ప్రకటించారు. మోదీ సర్కారు ప్రకటించిన ప్యాకేజీని విపక్షాలే కాకుండా విదేశాలు కూడా తూర్పారబడుతున్నాయని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయినా ఈ ప్యాకేజీలో కేంద్రం తనదైన ఫ్యూడల్ వైఖరిని బయటపెట్టుకుని తన పరువును తానే తీసుకుందని కూడా కేసీఆర్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ప్యాకేజీలో దేశంలోని రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ సర్కారు బిక్షగాళ్లలా చూసిందని కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కేంద్రం ప్యాకేజీ… ఓ దుర్మార్గపు ప్యాకేజీనేనని కేసీఆర్ విరుచుకుపడ్డారు.
అయినా కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరుకున్నది ఫ్యూడల్ తరహా ప్యాకేజీ కానే కాదని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు వచ్చేలా ప్యాకేజీలు ఉండాలని భావించామని, అయితే అందుకు విరుద్ధంగా నరేంద్ర మోదీ సర్కారు ఫ్యూడల్ భావజాలమున్న ప్యాకేజీని ప్రకటించిందని కేసీఆర్ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని అన్ని వ్యవస్థలు ప్రైవేట్ పరం కాక తప్పదని కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల నుంచి కేంద్రం సెస్ ల రూపంలో పన్నులు వసూలు చేస్తోందని, కేంద్రం అవలంబిస్తున్న ఈ వైఖరితో రాష్ట్రాలు మునిగిపోక తప్పదని కూడా కేసీఆర్ హెచ్చరించారు. మొత్తంగా మొన్నటిదాకా మోదీ సర్కారును ఏమీ అనని కేసీఆర్… ఇప్పుడు ఏకంగా మోదీ సర్కారుపై ఓ రేంజిలో విరుచుకుపడటం నిజంగానే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి.
This post was last modified on May 18, 2020 9:31 pm
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…