కరోనా విపత్తు వల్ల ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య కంటే ఈ లాక్ డౌన్స్ వల్ల మునుముందు రాబోయే తలనొప్పులే తీవ్రంగా ఉంటాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతూ ఉండగా ఐటీ రంగం దీనికి బాగా ఎఫెక్ట్ కానుంది. చాలా కంపెనీలు మూత పడే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పలు ఐటీ సంస్థలు యూకే, యూఎస్ లో ఉండడం వల్ల, అవి కరోనా వైరస్ కి తీవ్రంగా నష్టపోవడం వల్ల సమస్యలు తప్పవంటున్నారు. ఇప్పటికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారికి సదరు ఉద్యోగాలు లేవని కొన్ని సంస్థలు సమాచారం అందించాయి. పాత ఉద్యోగులలో కూడా చాలా మందికి పింక్ స్లిప్స్ ఇవ్వవచ్చునని అంచనాలున్నాయి.
జూన్ లో ఏటా వచ్చే ఇంక్రిమెంట్లు ఈసారి ఉండవట. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్తున్న వారు కూడా ఇక దేశీయ అవకాశాల కోసం చూసుకోవాల్సిందే. కరోనా మరణాల కంటే ఆర్ధిక మాంద్యం వల్ల ఒత్తిడికి లోనయి ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చునని అగ్ర రాజ్యమే కంగారు పడుతున్న వేళ మానసికంగా సిద్ధపడాల్సిన తరుణమిది.
This post was last modified on April 9, 2020 6:46 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…