Categories: Political News

ఐటీ ఉద్యోగాలకు ఎసరు తప్పదు!

కరోనా విపత్తు వల్ల ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య కంటే ఈ లాక్ డౌన్స్ వల్ల మునుముందు రాబోయే తలనొప్పులే తీవ్రంగా ఉంటాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతూ ఉండగా ఐటీ రంగం దీనికి బాగా ఎఫెక్ట్ కానుంది. చాలా కంపెనీలు మూత పడే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పలు ఐటీ సంస్థలు యూకే, యూఎస్ లో ఉండడం వల్ల, అవి కరోనా వైరస్ కి తీవ్రంగా నష్టపోవడం వల్ల సమస్యలు తప్పవంటున్నారు. ఇప్పటికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారికి సదరు ఉద్యోగాలు లేవని కొన్ని సంస్థలు సమాచారం అందించాయి. పాత ఉద్యోగులలో కూడా చాలా మందికి పింక్ స్లిప్స్ ఇవ్వవచ్చునని అంచనాలున్నాయి.

జూన్ లో ఏటా వచ్చే ఇంక్రిమెంట్లు ఈసారి ఉండవట. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్తున్న వారు కూడా ఇక దేశీయ అవకాశాల కోసం చూసుకోవాల్సిందే. కరోనా మరణాల కంటే ఆర్ధిక మాంద్యం వల్ల ఒత్తిడికి లోనయి ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చునని అగ్ర రాజ్యమే కంగారు పడుతున్న వేళ మానసికంగా సిద్ధపడాల్సిన తరుణమిది.

This post was last modified on April 9, 2020 6:46 pm

Share

Recent Posts

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

5 minutes ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

11 minutes ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

23 minutes ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

26 minutes ago

అన్నయ్యను పలకరించాలి బ్రహ్మానందం గారూ…

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి…

52 minutes ago

రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి: కొండా సుష్మిత

పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే,…

59 minutes ago