తీవ్ర ఉత్కంఠకు దారితీసిన నలుగురు నేతల ఎమ్మెల్సీ పోస్టుల విషయంలో ఎట్టకేలకు .. గవర్నర్ విశ్వభూషణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నలుగురు నేతల్లో ఇద్దరి విషయం డోలాయమానంలో పడేసరికి సీఎం జగన్ హుటాహుటిన గవర్నర్ విశ్వభూషణ్ను కలిసి వివరణ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చేందుకు గవర్నర్ ఓకే చెప్పారు.
గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన నాలుగు ఎమ్మెల్సీ పోస్టులకు వైసీపీ సర్కారు.. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ల పేర్లను సూచిస్తూ.. గవర్నర్కు నోట్ పంపించింది. అయితే ఇది జరిగి నాలుగు రోజులు అయింది. కానీ, గవర్నర్ దీనిని ఆమోదించలేదు. దీనికి కారణం.. జగన్ సర్కారు సూచించిన నలుగురిలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉండడమే.
లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు.. గవర్నర్కు కూడా సమాచారం అందింది. దీంతో ఆయన హోం డిపార్ట్మెంట్ నుంచి సమాచారం తెప్పించుకుని.. ఫైల్ను నిలుపుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ఇద్దరిపై వేటు తప్పదని.. జగన్ వేరేవారిని ఎంపిక చేయాల్సిందేనని వార్తలు వచ్చాయి. అయితే.. తాము సూచించిన నలుగురికి ఎమ్మెల్సీ పదవులు ఇప్పించుకోవడాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ క్రమంలో హుటాహుటిన ఆయన గవర్నర్ అప్పాయింట్మెంట్ తీసుకుని.. ఆయనను కలిశారు. నామినేటెడ్ కోటాలో ఎంపికైన నలుగురి బయోడేటాను ఆయన సుదీర్ఘసమయం గవర్నర్కు వివరించిన ట్టు సమాచారం. రాజకీయ ప్రేరేపితమైన కేసులేనని.. అవి నిలిచేవి కావని కూడా వివరించినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్.. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తుల అభ్యర్థిత్వాలకు పచ్చజెండా ఊపారు.
This post was last modified on June 14, 2021 10:24 pm
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…