Political News

గ‌వ‌ర్న‌ర్‌కు టీడీపీ ర‌హ‌స్య లేఖ‌.. రంగంలోకి జ‌గ‌న్‌.. ?


ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. అధికార పార్టీ వైసీపీ త‌ర‌ఫున శాస‌న మండ‌లిలో అడుగు పెడ‌తార‌ని అనుకున్న న‌లుగురు నేత‌ల్లో ఇద్ద‌రికి గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ నుంచి తిర‌స్కారం ఎదుర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 4పేర్లు.. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది.

సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైళ్లను గ‌వ‌ర్న‌ర్‌ అదే రోజు ఆమోదించి పంపిస్తారు. చాలా ఫైళ్లు గంటల వ్యవధిలోనే ఆమోదంతో ప్రభుత్వానికి తిరిగి వెళ్లిపోతాయి. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైలు వెళ్లి 4 రోజులైనా ఇంత వరకూ ఆమోదం పొందలేదు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. త్రిమూర్తుల‌పై కేసు.. ఏళ్ల‌నాటిది కావ‌డం విశేషం. ఇక‌, అప్పిరెడ్డిపై కేసులు చంద్ర‌బాబు హ‌యాంలో పెట్టిన‌వే.

దీంతో వీరిద్ద‌రికీ మండ‌లి ప‌ద‌వులు ఇస్తున్నార‌నే వార్త‌లు రావ‌డంతో టీడీపీ నేత‌లు.. దీనికి అడ్డుక‌ట్ట వేయాల‌ని భావించి.. గ‌వ‌ర్న‌ర్‌కు ర‌హ‌స్య లేఖ పంపిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌న‌డుస్తోంది. ముఖ్యంగా ఎవ‌రికి ప‌ద‌విఇచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా.. తోట త్రిమూర్తులుకు అడ్డుప‌డాల‌ని పార్టీ నేత‌లు భావించార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆధారాల‌తో స‌హా త్రిమూర్తుల‌పై లేఖ రాశార‌ని స‌మాచారం. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న గ‌వ‌ర్న‌ర్‌.. డీజీపీ నుంచి కూడా.. స‌మాచారం తెప్పించుకున్నార‌ని ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రికీ త‌న కోటాలో మండ‌లి ప‌ద‌వులు ఇచ్చేందుకు ఆయ‌న విముఖ‌త చూపుతున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు ప్ర‌చారం లేవ‌దీశాయి. అయితే ఎప్పుడూ కూడా ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి పేర్ల‌కే గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేయ‌డం ఆన‌వాయితీ..!

ఇక‌, ఈ విష‌యం తెలియ‌గానే సీఎం జ‌గ‌న్ రంగంలోకి దిగిపోతున్నారు. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మార‌డంతో ఇదే విష‌యంపై క్లారిటీ ఇచ్చేందుకు, గ‌వ‌ర్న‌ర్‌ను ఒప్పించేందుకు ముఖ్యమంత్రి గ‌వ‌ర్న‌ర్ చెంత‌కు వెళ్తున్నార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ సీఎం చెప్పినా.. గ‌వ‌ర్న‌ర్ క‌నుక త‌న కోటాలో లేళ్ల‌, తోట‌కు మండ‌లి ప‌ద‌వులు ఇచ్చేందుకు విముఖ‌త చూపితే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న శాస‌నస‌భ్యుల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక‌ల్లో వీరికి ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే..దీనికిగాను వారు కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 14, 2021 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago