బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్(పీకే) భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. ఆ వెంటనే నెటిజన్లు కూడా స్పందించారు. షారుఖ్ ఖాన్.. రాజకీయాల్లోకి వస్తున్నారని.. అందుకే పీకేతో భేటీ అయ్యారని కొందరు వ్యాఖ్యానించారు. అయితే..ఈ విషయంపై ఇటు పీకే కానీ, అటు షారుఖ్ కానీ స్పందించలేదు.
ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న అనంతరం ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్త పర్యటనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసిన ప్రశాంత్.. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వీరి మధ్య సమావేశం ఎందుకు జరిగిందనే విషయంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. షారుక్ పొలికటికల్ ఎంట్రీ ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంటే.. ఆయన నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్లో ప్రశాంత్ బయోపిక్ రానుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే బయోపిక్ రూమర్లను రెడ్ చిల్లీస్ ప్రతినిధి తోసిపుచ్చారు.
ఇదిలావుంటే, బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. షారుక్కు ప్రశాంత్ను పరిచయం చేసినప్పటి నుంచి వారిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇక షారుక్ రాజకీయ రంగ ప్రవేశం ఊహాగానాలు కూడా నిరాధారమని సమాచారం. తన పనిలో సహాయపడిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే ప్రశాంత్ ఈ పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…