బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్(పీకే) భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. ఆ వెంటనే నెటిజన్లు కూడా స్పందించారు. షారుఖ్ ఖాన్.. రాజకీయాల్లోకి వస్తున్నారని.. అందుకే పీకేతో భేటీ అయ్యారని కొందరు వ్యాఖ్యానించారు. అయితే..ఈ విషయంపై ఇటు పీకే కానీ, అటు షారుఖ్ కానీ స్పందించలేదు.
ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న అనంతరం ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్త పర్యటనలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసిన ప్రశాంత్.. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వీరి మధ్య సమావేశం ఎందుకు జరిగిందనే విషయంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. షారుక్ పొలికటికల్ ఎంట్రీ ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంటే.. ఆయన నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్లో ప్రశాంత్ బయోపిక్ రానుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే బయోపిక్ రూమర్లను రెడ్ చిల్లీస్ ప్రతినిధి తోసిపుచ్చారు.
ఇదిలావుంటే, బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. షారుక్కు ప్రశాంత్ను పరిచయం చేసినప్పటి నుంచి వారిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇక షారుక్ రాజకీయ రంగ ప్రవేశం ఊహాగానాలు కూడా నిరాధారమని సమాచారం. తన పనిలో సహాయపడిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే ప్రశాంత్ ఈ పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది.
This post was last modified on June 14, 2021 8:14 am
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…