Political News

జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ 48 గంట‌ల గ‌డువు..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస లేఖ‌లు రాస్తున్న వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా మ‌రో లేఖ సంధించారు. ఈ లేఖ‌లో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు, పార్టీ నేత‌ల‌కు ఆయ‌న 48 గంట‌ల గ‌డువు విధించారు. ఈ లోగా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. తానే సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్ప‌డు ఆర్ ఆర్ ఆర్ రాసిన లేఖ సీఎం జ‌గ‌న్‌కు మ‌రింత షాకిస్తోంది.

కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ వెబ్‌సైట్‌ నుంచి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పేరును తొల‌గించారు. ఈ ప‌రిణామం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర‌ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయింది. వెంట‌నే స్పందించిన ర‌ఘురామ తాజాగా ఇదే విష‌యంపై నిల‌దీస్తూ.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ సంధించారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు.

వైసీపీ తరఫున గెలిచిన తాను ఇప్ప‌టికీ వైసీపీ ఎంపీగానే కొన‌సాగుతున్నాన‌ని.. అలాంటిది వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును ఎందుకు తొలగించారని నిల‌దీశారు. పార్టీ నుంచి బహిష్కరించారా? అని సందేహం వ్యక్తం చేశారు. పొరపాటున తొలగించారా? లేక కావాలనే చేశారా? అని స్పష్టత కోరారు. కావాలని తొలగించి ఉంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు.

48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ దృష్టికి తీసుకెళ్తానని ర‌ఘురామ‌ స్పష్టం చేశారు. నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం ఈ లేఖపై వైసీపీ నాయ‌క‌త్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.

This post was last modified on June 13, 2021 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

4 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

5 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

7 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago