Political News

జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ 48 గంట‌ల గ‌డువు..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస లేఖ‌లు రాస్తున్న వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా మ‌రో లేఖ సంధించారు. ఈ లేఖ‌లో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు, పార్టీ నేత‌ల‌కు ఆయ‌న 48 గంట‌ల గ‌డువు విధించారు. ఈ లోగా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. తానే సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్ప‌డు ఆర్ ఆర్ ఆర్ రాసిన లేఖ సీఎం జ‌గ‌న్‌కు మ‌రింత షాకిస్తోంది.

కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ వెబ్‌సైట్‌ నుంచి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పేరును తొల‌గించారు. ఈ ప‌రిణామం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర‌ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయింది. వెంట‌నే స్పందించిన ర‌ఘురామ తాజాగా ఇదే విష‌యంపై నిల‌దీస్తూ.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ సంధించారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు.

వైసీపీ తరఫున గెలిచిన తాను ఇప్ప‌టికీ వైసీపీ ఎంపీగానే కొన‌సాగుతున్నాన‌ని.. అలాంటిది వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును ఎందుకు తొలగించారని నిల‌దీశారు. పార్టీ నుంచి బహిష్కరించారా? అని సందేహం వ్యక్తం చేశారు. పొరపాటున తొలగించారా? లేక కావాలనే చేశారా? అని స్పష్టత కోరారు. కావాలని తొలగించి ఉంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు.

48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ దృష్టికి తీసుకెళ్తానని ర‌ఘురామ‌ స్పష్టం చేశారు. నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం ఈ లేఖపై వైసీపీ నాయ‌క‌త్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.

This post was last modified on June 13, 2021 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago