Political News

జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ 48 గంట‌ల గ‌డువు..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస లేఖ‌లు రాస్తున్న వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా మ‌రో లేఖ సంధించారు. ఈ లేఖ‌లో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు, పార్టీ నేత‌ల‌కు ఆయ‌న 48 గంట‌ల గ‌డువు విధించారు. ఈ లోగా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. తానే సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్ప‌డు ఆర్ ఆర్ ఆర్ రాసిన లేఖ సీఎం జ‌గ‌న్‌కు మ‌రింత షాకిస్తోంది.

కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ వెబ్‌సైట్‌ నుంచి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పేరును తొల‌గించారు. ఈ ప‌రిణామం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర‌ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయింది. వెంట‌నే స్పందించిన ర‌ఘురామ తాజాగా ఇదే విష‌యంపై నిల‌దీస్తూ.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ సంధించారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు.

వైసీపీ తరఫున గెలిచిన తాను ఇప్ప‌టికీ వైసీపీ ఎంపీగానే కొన‌సాగుతున్నాన‌ని.. అలాంటిది వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును ఎందుకు తొలగించారని నిల‌దీశారు. పార్టీ నుంచి బహిష్కరించారా? అని సందేహం వ్యక్తం చేశారు. పొరపాటున తొలగించారా? లేక కావాలనే చేశారా? అని స్పష్టత కోరారు. కావాలని తొలగించి ఉంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు.

48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ దృష్టికి తీసుకెళ్తానని ర‌ఘురామ‌ స్పష్టం చేశారు. నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం ఈ లేఖపై వైసీపీ నాయ‌క‌త్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.

This post was last modified on June 13, 2021 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago