వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాల్సిందిగా వైకాపా చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్సభ స్పీకర్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని ఎంపీ భరత్ స్పీకర్కు విన్నవించుకున్నారు.
కాగా.. దీనిపై రఘురామా స్పందించారు. తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని.. అయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను మాత్రమే ఎత్తి చూపానని చెప్పారు. తనపై అనర్హత వేటు వేయడం ఎట్టి పరిస్థితులలో సాధ్యం కాదని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాసారు.
“కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశా. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. నాపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తా. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. హోంమంత్రి అమిత్షా ని సీఎం జగన్ కలిశాకే ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అనర్హత వేటుపై ఇప్పటికే నాపై నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారు” అని రఘురామ అన్నారు.
This post was last modified on June 12, 2021 6:50 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…