దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎదురుగాలిని ఎదుర్కోవడం, ప్రతిపక్ష పార్టీగా పుంజుకోవాల్సింది పోయి బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఎదురుకానుందని ప్రచారం జరుగుతోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బెంగాల్ లో అధికార పార్టీ అయిన టీఎంసీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరికల విషయంలో సీరియస్ గా ఉన్న మమతా బెనర్జీ ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు.
రాహుల్ గాంధీ సన్నిహితుడనే పేరున్న మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ టీంలోని యువనేతలపై వివిధ వర్గాల చూపు పడింది. గతంలో ఎంపీగా పనిచేసి ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్ గానూ వ్యవహరించి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అడుగులపై చర్చ జరిగింది. ముఖర్జీ స్నేహితుడు జితిన్ ప్రసాద వలే ఆయన సైతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను ముఖర్జీ తోసిపుచ్చారు.
తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, టీఎంసీ లేదా ఇతర పార్టీలో చేరతాననే ప్రచారం అవాస్తవమని అభిజిత్ ముఖర్జీ తేల్చిచెప్పారు. ప్రస్తుతం టీఎంసీలో ఉన్న తన తండ్రి సహచరులే ఇలాంటి వదంతులకు కారణమని ముఖర్జీ పేర్కొన్నారు. తాను టీఎంసీ భవన్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని అభిజిత్ అన్నారు. అభిజిత్ జంగిపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. కోల్కతా నుంచి జంగీపూర్ దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఎంసీలో చేరతానని వస్తున్న వార్తలకు అభిజిత్ ఇలా వ్యంగ్యంగా కొట్టిపారేశారు.
This post was last modified on June 12, 2021 6:35 pm
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ…
స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు…