లాక్ డౌన్ పొడిగింపే.. సంకేతాలిచ్చేసిన కేసీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 21 రోజుల దేశ‌వ్యాప్త లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియ‌నుంది. ఐతే క‌రోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఏమో కానీ.. తెలంగాణ‌లో మాత్రం లాక్ డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా ప్రెస్ మీట్‌ను బ‌ట్టి ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ కొన‌సాగించ‌డం త‌ప్ప వేరే మార్గంలేద‌ని.. ఎత్తివేస్తే క‌రోనా వ్యాప్తి విప‌రీతంగా పెరిగిపోతుంద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని ప్ర‌ధానికి తాను సూచించిన‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు.

‘‘లాక్ డౌన్ ఎత్తేయడం చిన్న విషయం కాదు. ఒక్కసారి తాళం తీస్తే జ‌నాలు ఇక ఆగుతారా? మసీదులు, గుళ్ళు, పబ్బులు.. ఇలా అన్ని చోట్లా కార్యక్రమాలు మొదలు పెడ్తారు. అప్పుడు జరిగే నష్టం మనం భరించలేము. అందుకే మోడీగారు న‌న్ను అడిగితే లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిది అని చెప్పినా’’ అని కేసీఆర్ అన్నారు. మ‌రోవైపు ప్రధాని పిలుపిచ్చిన లైట్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని కూడా కొందరు కుసంస్కారులు సోషల్ మీడియా హేళన చేస్తున్నారని.. ఇలాంటి విపత్కర సమయంలోనే అందరూ ఐక‌మ‌త్యంతో ఉండాల‌ని.. ఇలాంటి వాటిపై విమ‌ర్శ‌లు త‌గ‌వ‌ని కేసీఆర్ అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎన్నో ఇబ్బందుల‌కు ఓర్చి క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్భందికి, హాస్పిటళ్ల‌లో స్వీపర్లకి, క్లీన‌ర్ల‌కి అంద‌రికీ చేతులెత్తి దండం పెడుతున్నాన‌ని.. వాళ్ల‌కెంత మొక్కినా తక్కువే అని, వారి త్యాగం చాలా గొప్పద‌ని కేసీఆర్ కొనియాడారు.

This post was last modified on April 9, 2020 6:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

32 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

51 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago