మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభావం.. టీఆర్ఎస్ పై గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయనతోపాటు.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
అయితే.. వీళ్లు కాకుండా.. హరీష్ రావు కీలక అనుచరుడు ఒకరు కూడా పార్టీ వీడనున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘంగా ఉన్న టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశ్వద్ధామరెడ్డి… తెలంగాణ ఉద్యమం నుండి మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కొంతకాలం క్రితం వరకు టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా కూడా హరీష్ రావే ఉండేవారు.
అయితే, ఇటీవల ఆర్టీసీ కార్మికులంతా సమ్మె బాట పట్టడంతో అశ్వద్ధామ రెడ్డి… టీఆర్ఎస్ పార్టీతో కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన్ను ఆ సంఘం నుండి పంపేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ దశలో అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…