మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభావం.. టీఆర్ఎస్ పై గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయనతోపాటు.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
అయితే.. వీళ్లు కాకుండా.. హరీష్ రావు కీలక అనుచరుడు ఒకరు కూడా పార్టీ వీడనున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘంగా ఉన్న టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశ్వద్ధామరెడ్డి… తెలంగాణ ఉద్యమం నుండి మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కొంతకాలం క్రితం వరకు టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా కూడా హరీష్ రావే ఉండేవారు.
అయితే, ఇటీవల ఆర్టీసీ కార్మికులంతా సమ్మె బాట పట్టడంతో అశ్వద్ధామ రెడ్డి… టీఆర్ఎస్ పార్టీతో కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన్ను ఆ సంఘం నుండి పంపేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ దశలో అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on June 12, 2021 9:10 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…