నర్సాపురం ఎంపీ రఘురామ రాజుని ఏదో ఒకటి చేసేదాక.. వైసీపీ నేతలకు నిద్రపట్టేలా కనపడట్లేదు. ఇప్పటికే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసుతో అయినా.. ఆయన సైలెంట్ అవుతారని అందరూ భావించారు. అయితే.. ఆయన ఏమాత్రం తగ్గకుండా.. తిరిగి రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీంతో.. ఈసారి వైసీపీ అధిష్టానం సీరియస్ యాక్షన్కు దిగింది.
దీనిలో భాగంగా ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ శుక్రవారం స్పీకర్కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామను వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా కోరారు.
మరోవైపు తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టేందుకు యత్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే సమస్యే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత రాజుగారు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు, లోక్సభ స్పీకర్, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లు, తోటి ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లకు లేఖ రాశారు రఘురామ. మీడియాతో మాట్లాడకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూనే లేఖలతో ద్వారా తన పోరాటం సాగిస్తున్నారు.
జగన్ బెయిల్ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రఘురామ ఆరోపించారు. దీనిలో భాగంగానే తనను అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు. పార్లమెంటులో మీ పార్టీ ఎంపీలు తనకు మద్దతు ఇచ్చేలా చూడాలని ఆయన సీఎంలను కోరారు. తనపై సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసును తొలగించాలని కోరుతూ అసెంబ్లీల్లో తీర్మానాలు చేయాలని, ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆయన ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.
This post was last modified on June 11, 2021 9:55 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…