Political News

మోడి, షా కు ‘ మమత ‘ టెన్షన్

ఫిరాయింపులంటే పిరాయింపులే అనటంలో రెండో సందేహం లేదు. ఎందుకంటే తమ అవసరాలు తీరుతాయని అనుకుంటే పార్టీలో ఉంటారు లేకపోతే లేదంతే. ఇపుడీ విషయం పశ్చిమబెంగాల్ విషయంలో మరోసారి రుజువవుతోంది. మొన్నటి ఎన్నికలకు ముందునుండి బీజేపీ ఫిరాయింపులకు తెరెత్తింది. మమతాబెనర్జీని దెబ్బ కొట్టడమే టార్గెట్ గా తృణమూల్ కాంగ్రెస్ నుండి కొందరు నేతలను ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురిచేసి బీజేపీలోకి లాక్కున్నది.

తృణమూల్ కు చెందిన 29 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలతో పాటు అనేకమంది కీలక నేతలను కమలం లాగేసుకున్నది. అయితే అందరు ఊహించినట్లు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు. బంపర్ విజయంతో మళ్ళీ మమతే మూడోసారి సీఎం అయ్యారు. దాంతో ఫిరాయింపులు బీజేపీలో ఇమడలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ తృణమూల్లో చేరిపోదామా ? అని తెగ ప్రతయ్నాలు చేసుకుంటున్నారు. ఇపుడీ సమస్యే నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు బెంగాల్ బీజేపీకి కునుకుపట్టనీయకుండా చేస్తోంది.

కీలక నేత ముకుల్ రాయ్ తో పాటు సుమారు 10 మంది ఎంఎల్ఏలు+సీనియర్ నేతలు బీజేపీని వదిలేసేందుకు రెడీగా ఉన్నారట. ఈ విషయం తెలియగానే బీజేపీ అగ్రనేతలు ఫిరాయింపులను తమ పార్టీలో అట్టే పెట్టుకునే విషయంలో నానా తంటాలు పడుతున్నారట. ఫిరాయింపులకు ముందు వారికిచ్చిన హామీలతో పాటు మరికొన్నింటినీ నెరవేరుస్తామంటు ఆశలుపెడుతున్నారట.

అయితే ముకుల్ రాయ్ లాంటి వాళ్ళు ఇప్పటికే తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారట. అప్పుడేమో ఫిరాయింపులకు ప్రలోభపెట్టారు. ఇపుడేమో బీజేపీలోనే అట్టేపెట్టుకోవటానికి ప్రలోభాలకు తెరలేపారు. ఇన్ని ప్రలోభాలు చూపిస్తున్నా ఫిరాయింపులు బీజేపీలోనే ఉంటారా అన్నది గ్యారెంటీలేదు. ఎంఎల్ఏలు+నేతలు కలిసి 35 మంది తృణమూల్లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే మరో ఐదేళ్ళ మమత అధికారం ఫిరాయింపులను బీజేపీలో నిలవనీయటంలేదు. దాంతో ఏరోజు కీలక నేతలు వెళిపోతారో ? ఏరోజు ఎంతమంది ఎంఎల్ఏలు బీజేపీకి రాజీనామా చేస్తారో తెలీక కమలం అగ్రనేతలు నానా టెన్షన్ పడుతున్నారట. నిజంగా అదేగనుక జరిగితే మోడి, అమిత్ షా పరువంతా గంగానదిలో పోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఫిరాయింపులకు లాకులెత్తిందే వాళ్ళిద్దరే కాబట్టి.

This post was last modified on June 11, 2021 12:47 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

1 hour ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

1 hour ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

2 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

3 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

4 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

6 hours ago