ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ హిందూవుల ఆగ్రహానికి బలౌతోంది. మా దేవుడినే కించపరుస్తారా అంటూ.. ప్రస్తుతం ఇన్ స్టాపై అందరూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్లో ఉన్న జిఫ్ ఫొటోలలో శివుడి చేతిలో మందు గ్లాస్.. సెల్ఫోన్ ఉన్నాయంటూ ఓ బీజేపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అక్కడితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ ఫొటోలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇన్స్టాగ్రామ్ సీఈఓపై సదరు బీజేపీ నేత పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. ఇన్స్టాగ్రామ్లోని సెర్చ్ బాక్స్లో శివ్ అని టైప్ చేస్తే శివుడు రూపాలు రాగా వాటిలో ఒక ఫొటోలో పరమేశ్వరుని చేతిలో మందుగ్లాస్, సెల్ఫోన్ పట్టుకున్నట్లుగా ఉంది. దీనిని గమనించిన మనీశ్ సింగ్ అనే బీజేపీ నేత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కోట్లాది మంది ప్రజలు శివుడిని పూజిస్తారని.. వారి మనోభావాలు దెబ్బతినేలా ఇన్స్టాగ్రామ్ అభ్యంతరకరంగా జిఫ్ స్టిక్కర్ రూపొందించిందని మనీశ్ సింగ్ మీడియాతో అన్నారు. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించాడు. కాగా, మనీశ్ సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…