ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ హిందూవుల ఆగ్రహానికి బలౌతోంది. మా దేవుడినే కించపరుస్తారా అంటూ.. ప్రస్తుతం ఇన్ స్టాపై అందరూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్లో ఉన్న జిఫ్ ఫొటోలలో శివుడి చేతిలో మందు గ్లాస్.. సెల్ఫోన్ ఉన్నాయంటూ ఓ బీజేపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అక్కడితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ ఫొటోలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇన్స్టాగ్రామ్ సీఈఓపై సదరు బీజేపీ నేత పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. ఇన్స్టాగ్రామ్లోని సెర్చ్ బాక్స్లో శివ్ అని టైప్ చేస్తే శివుడు రూపాలు రాగా వాటిలో ఒక ఫొటోలో పరమేశ్వరుని చేతిలో మందుగ్లాస్, సెల్ఫోన్ పట్టుకున్నట్లుగా ఉంది. దీనిని గమనించిన మనీశ్ సింగ్ అనే బీజేపీ నేత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కోట్లాది మంది ప్రజలు శివుడిని పూజిస్తారని.. వారి మనోభావాలు దెబ్బతినేలా ఇన్స్టాగ్రామ్ అభ్యంతరకరంగా జిఫ్ స్టిక్కర్ రూపొందించిందని మనీశ్ సింగ్ మీడియాతో అన్నారు. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించాడు. కాగా, మనీశ్ సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
This post was last modified on June 10, 2021 11:54 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…