Political News

జగన్ అజెండా ఇదేనా ?

జగన్మోహన్ రెడ్డి రెండు మూడు అంశాల అజెండాతోనే ఢిల్లీ పర్యటన ఉండబోతోందని సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటమే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న అంశాలపై క్లారిటి తీసుకోవటానికి లేదా ఇవ్వటానికే జగన్ హోంమంత్రితో భేటీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఇంతకీ అంతటి కీలకమైన అంశాలేమిటంటే మొదటిది పోలవరం సవరించిన అంచనాలపై స్పష్టత. పోలవరం అంచనాల విషయంలో కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య చాలా గ్యాప్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం వ్యయం రు. 57 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని రాష్ట్రం పట్టుబడుతోంది. 2013 అంచనాల ప్రకారం రు.20 వేల కోట్లే ఇస్తామని కేంద్రం గట్టిగా చెబుతోంది.

ఇక రెండో అంశం ఏమిటంటే తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు విషయం. ఎంపిపై అనర్హత వేటు వేయాలని జగన్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను దాదాపు ఏడాది క్రితమే నోటీసిచ్చారు. దానిపై ఇంతవరకు అతీగతిలేదు. అఫ్ కోర్స్ ఈ విషయం రాజకీయపరమైన అంశం కాబట్టే నరేంద్రమోడి ఆమోదముద్ర లేకుండా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరని అందరికీ తెలిసిందే. సో మోడిని ఒప్పించాలంటే నేరుగా జగన్ అయినా కలవాలి లేదంటే అమిత్ షాను అయినా కన్వీన్స్ చేయాలి.

ఇక చివరి అంశం ఏమిటంటే ఎంపి కస్టడీ తర్వాత జరిగిన డెవలప్మెంట్లు. కస్టడీకి ఎందుకు తీసుకోవాల్సొచ్చింది ? కస్టడీలో ఏమి జరిగింది ? తర్వాత ఎంపి ఆరోపణలు, వాస్తవాలేమిటి అనే విషయాలపై తన వాదన వినిపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సందర్భంగా ఎటూ ఢిల్లీ చేరుకుంటున్నారు కాబట్టి అవకాశాన్నిబట్టి ఇతర కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్ పర్యటన కీలకమైనదనే చెప్పాలి.

This post was last modified on June 10, 2021 11:39 am

Share
Show comments

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

3 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

6 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

6 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

8 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

10 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

10 hours ago