Political News

జగన్ అజెండా ఇదేనా ?

జగన్మోహన్ రెడ్డి రెండు మూడు అంశాల అజెండాతోనే ఢిల్లీ పర్యటన ఉండబోతోందని సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటమే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న అంశాలపై క్లారిటి తీసుకోవటానికి లేదా ఇవ్వటానికే జగన్ హోంమంత్రితో భేటీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ఇంతకీ అంతటి కీలకమైన అంశాలేమిటంటే మొదటిది పోలవరం సవరించిన అంచనాలపై స్పష్టత. పోలవరం అంచనాల విషయంలో కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య చాలా గ్యాప్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం వ్యయం రు. 57 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని రాష్ట్రం పట్టుబడుతోంది. 2013 అంచనాల ప్రకారం రు.20 వేల కోట్లే ఇస్తామని కేంద్రం గట్టిగా చెబుతోంది.

ఇక రెండో అంశం ఏమిటంటే తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు విషయం. ఎంపిపై అనర్హత వేటు వేయాలని జగన్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను దాదాపు ఏడాది క్రితమే నోటీసిచ్చారు. దానిపై ఇంతవరకు అతీగతిలేదు. అఫ్ కోర్స్ ఈ విషయం రాజకీయపరమైన అంశం కాబట్టే నరేంద్రమోడి ఆమోదముద్ర లేకుండా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరని అందరికీ తెలిసిందే. సో మోడిని ఒప్పించాలంటే నేరుగా జగన్ అయినా కలవాలి లేదంటే అమిత్ షాను అయినా కన్వీన్స్ చేయాలి.

ఇక చివరి అంశం ఏమిటంటే ఎంపి కస్టడీ తర్వాత జరిగిన డెవలప్మెంట్లు. కస్టడీకి ఎందుకు తీసుకోవాల్సొచ్చింది ? కస్టడీలో ఏమి జరిగింది ? తర్వాత ఎంపి ఆరోపణలు, వాస్తవాలేమిటి అనే విషయాలపై తన వాదన వినిపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సందర్భంగా ఎటూ ఢిల్లీ చేరుకుంటున్నారు కాబట్టి అవకాశాన్నిబట్టి ఇతర కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్ పర్యటన కీలకమైనదనే చెప్పాలి.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

5 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

43 minutes ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

50 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago