ఇటీవల కాలంలో పలు అంశాలపై లేఖలు రాస్తున్న ముఖ్యమంత్రి జగన్.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇప్పటి వరకు టీకాలు, కరోనా మందులపై ప్రధానికి లేఖ రాసిన జగన్.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అందరూ కలిసి రావాలంటూ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు సంధించారు. అయితే.. వీటికి రెస్పాన్స్ ఏమీ కనిపించలేదు. ఇదిలావుంటే.. తాజాగా మరోసారి సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడం.. ఆసక్తిగా మారింది. మొత్తం నాలుగు పేజీల లేఖలో జగన్.. ఏమన్నారంటే..
‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని జగన్ .. ప్రధానిని కొనియాడారు. 2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని సంకల్పం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ మేరకు.. “ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం” అని వివరించారు.
అంతేకాదు.. “ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి” అని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్, ప్రధాన మంత్రిని కోరారు. ఈ సంద ర్భంగా కేంద్రంలోని ప్రధాని పాలనను, కరోనా సమయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని కూడా జగన్.. ప్రశంసించడం గమనార్హం.
This post was last modified on June 8, 2021 1:54 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…