Political News

ప్ర‌ధాని మోడీకి జ‌గ‌న్ 4 పేజీల లేఖ‌.. ఏం రాశారంటే

ఇటీవ‌ల కాలంలో ప‌లు అంశాల‌పై లేఖ‌లు రాస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీకాలు, క‌రోనా మందుల‌పై ప్ర‌ధానికి లేఖ రాసిన జ‌గ‌న్‌.. ఈ విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అంద‌రూ క‌లిసి రావాలంటూ.. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కూడా లేఖ‌లు సంధించారు. అయితే.. వీటికి రెస్పాన్స్ ఏమీ క‌నిపించ‌లేదు. ఇదిలావుంటే.. తాజాగా మ‌రోసారి సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాయ‌డం.. ఆస‌క్తిగా మారింది. మొత్తం నాలుగు పేజీల లేఖ‌లో జ‌గ‌న్‌.. ఏమ‌న్నారంటే..

‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని జగన్ .. ప్ర‌ధానిని కొనియాడారు. 2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని సంకల్పం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ మేరకు.. “ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం” అని వివ‌రించారు.

అంతేకాదు.. “ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి” అని ప్ర‌ధానికి విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్‌ జగన్‌, ప్రధాన మంత్రిని కోరారు. ఈ సంద ర్భంగా కేంద్రంలోని ప్ర‌ధాని పాల‌న‌ను, క‌రోనా స‌మ‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని కూడా జ‌గ‌న్‌.. ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

స్లమ్ డాగ్ … పూరి కొత్త మార్కు

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…

1 hour ago

విశాఖ స్టీల్‌: ఆది నుంచి ప్ర‌మాద‌పుటంచునే

ఆంధ్రుల హ‌క్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడ‌ల‌ను ఏకం చేసిన ఉద్య‌మం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం.. గ‌త రెండు…

4 hours ago

హమ్మయ్యా… కనకరాజుకి మోక్షం దొరికింది

విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…

5 hours ago

పెద్దికి పెద్ద షాక్ అక్క‌డే..

గ‌త వారం భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్షెకుల ముందుకు వ‌చ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే భారీ…

7 hours ago

కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ!

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…

8 hours ago

శోక సంద్రంలో ‘విజయోత్సం’ వద్దబ్బా

ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…

10 hours ago