స్వదేశీ వ్యాక్సిన్ సత్తాను మనం ప్రపంచ దేశాలకు చూపించామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 21 నుండి దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 100శాతం వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని, ఇక నుండి రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అవసరం లేకుండా… కేంద్రమే పూర్తిగా పంపిణీ చేస్తుందని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో కేవలం 25శాతం వ్యాక్సిన్లు ప్రైవేటులో అందుబాటులో ఉంటాయని, మిగతావన్ని కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు ప్రధాని. దేశంలో మరో మూడు కంపెనీల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని… గతంలో విదేశాల్లో టీకాలు వచ్చినా ఇండియాకు వచ్చేందుకు ఏళ్లు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్ లోనూ ఆర్మీ, నేవీ సహ అనేక సంస్థలు నడుంబిగించి… ఆక్సిజన్ సరఫరా యుద్ధప్రాతిపదికన చేశామన్నారు.
This post was last modified on June 7, 2021 10:01 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…