స్వదేశీ వ్యాక్సిన్ సత్తాను మనం ప్రపంచ దేశాలకు చూపించామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 21 నుండి దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 100శాతం వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని, ఇక నుండి రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అవసరం లేకుండా… కేంద్రమే పూర్తిగా పంపిణీ చేస్తుందని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో కేవలం 25శాతం వ్యాక్సిన్లు ప్రైవేటులో అందుబాటులో ఉంటాయని, మిగతావన్ని కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు ప్రధాని. దేశంలో మరో మూడు కంపెనీల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని… గతంలో విదేశాల్లో టీకాలు వచ్చినా ఇండియాకు వచ్చేందుకు ఏళ్లు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్ లోనూ ఆర్మీ, నేవీ సహ అనేక సంస్థలు నడుంబిగించి… ఆక్సిజన్ సరఫరా యుద్ధప్రాతిపదికన చేశామన్నారు.
This post was last modified on June 7, 2021 10:01 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…