స్వదేశీ వ్యాక్సిన్ సత్తాను మనం ప్రపంచ దేశాలకు చూపించామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 21 నుండి దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 100శాతం వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని, ఇక నుండి రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అవసరం లేకుండా… కేంద్రమే పూర్తిగా పంపిణీ చేస్తుందని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో కేవలం 25శాతం వ్యాక్సిన్లు ప్రైవేటులో అందుబాటులో ఉంటాయని, మిగతావన్ని కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు ప్రధాని. దేశంలో మరో మూడు కంపెనీల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని… గతంలో విదేశాల్లో టీకాలు వచ్చినా ఇండియాకు వచ్చేందుకు ఏళ్లు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్ లోనూ ఆర్మీ, నేవీ సహ అనేక సంస్థలు నడుంబిగించి… ఆక్సిజన్ సరఫరా యుద్ధప్రాతిపదికన చేశామన్నారు.
This post was last modified on June 7, 2021 10:01 pm
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…