సీఎం జగన్ సర్కారుపై ప్రముఖ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ సీరియస్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా? అంటూ.. ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదలకు చేశారు. నిజానికి ఇప్పటి వరకు క్రికెట్ విషయాలకు మాత్రమే పరిమితమైన ఎమ్మెస్కే ప్రసాద్.. ఏపీలో జరుగుతున్న కూల్చివేతలపై తొలిసారి పెదవి విప్పారు. విశాఖపట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.
‘హిడెన్ స్ప్రౌట్స్’ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 150కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని ప్రసాద్ తెలిపారు. పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్ జీవిత మంతా స్కూల్కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తుచేశారు. అందుకే శ్రీనివాస్కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. ఉచితంగా ఇక్కడ మానసిక దివ్యాంగులకు శ్రీనివాస్ ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిపారు.
అలాంటి పాఠశాలలను కూల్చివేయడంపై సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని ప్రసాద్ కోరారు. విశాఖలో మానసిక దివ్యాంగులకు చదువు చెప్పే పాఠశాలను శనివారం జీవీఎంసీ అధికారులు కూలగొట్టిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పేర్కొన్న ప్రసాద్.. దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఆ మాత్రం మానవత్వం కూడా కూల్చివేతల కోసం వచ్చిన అధికారులు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on June 7, 2021 10:11 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…