సీఎం జగన్ సర్కారుపై ప్రముఖ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ సీరియస్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా? అంటూ.. ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదలకు చేశారు. నిజానికి ఇప్పటి వరకు క్రికెట్ విషయాలకు మాత్రమే పరిమితమైన ఎమ్మెస్కే ప్రసాద్.. ఏపీలో జరుగుతున్న కూల్చివేతలపై తొలిసారి పెదవి విప్పారు. విశాఖపట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.
‘హిడెన్ స్ప్రౌట్స్’ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 150కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని ప్రసాద్ తెలిపారు. పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్ జీవిత మంతా స్కూల్కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తుచేశారు. అందుకే శ్రీనివాస్కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. ఉచితంగా ఇక్కడ మానసిక దివ్యాంగులకు శ్రీనివాస్ ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిపారు.
అలాంటి పాఠశాలలను కూల్చివేయడంపై సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని ప్రసాద్ కోరారు. విశాఖలో మానసిక దివ్యాంగులకు చదువు చెప్పే పాఠశాలను శనివారం జీవీఎంసీ అధికారులు కూలగొట్టిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పేర్కొన్న ప్రసాద్.. దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఆ మాత్రం మానవత్వం కూడా కూల్చివేతల కోసం వచ్చిన అధికారులు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on June 7, 2021 10:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…