సీఎం జగన్ సర్కారుపై ప్రముఖ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ సీరియస్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా? అంటూ.. ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదలకు చేశారు. నిజానికి ఇప్పటి వరకు క్రికెట్ విషయాలకు మాత్రమే పరిమితమైన ఎమ్మెస్కే ప్రసాద్.. ఏపీలో జరుగుతున్న కూల్చివేతలపై తొలిసారి పెదవి విప్పారు. విశాఖపట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.
‘హిడెన్ స్ప్రౌట్స్’ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 150కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని ప్రసాద్ తెలిపారు. పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్ జీవిత మంతా స్కూల్కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తుచేశారు. అందుకే శ్రీనివాస్కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. ఉచితంగా ఇక్కడ మానసిక దివ్యాంగులకు శ్రీనివాస్ ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిపారు.
అలాంటి పాఠశాలలను కూల్చివేయడంపై సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని ప్రసాద్ కోరారు. విశాఖలో మానసిక దివ్యాంగులకు చదువు చెప్పే పాఠశాలను శనివారం జీవీఎంసీ అధికారులు కూలగొట్టిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పేర్కొన్న ప్రసాద్.. దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఆ మాత్రం మానవత్వం కూడా కూల్చివేతల కోసం వచ్చిన అధికారులు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…