అందరికీ టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ విధానం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కోటి టీకాల కొనుగోలుకు ఏపి ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ గడువు తేదీ గురువారంతో ముగిసింది. తాజా సమాచారం ప్రకారం కనీసం ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా టెండర్లో పాల్గొనలేదని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ స్వయంగా చెప్పారు.
గ్లోబల్ టెండర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వటం మన దగ్గరే కాదు దాదాపు అన్నీ రాష్ట్రాలదీ ఇదే పరిస్ధితి. గ్లోబల్ టెండర్లకు మొదట వెళ్ళింది మహారాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఉత్తరప్రదేశ్, కేరళ, ఒడిస్సా, కర్నాటక, తమిళనాడు, తెలంగాణా, ఏపి, గోవా, ఢిల్లీ కూడా గ్లోబల్ టెండర్లు పిలిచాయి. అయితే ఏ రాష్ట్రానికి కూడా ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా టెండర్ దాఖలు చేయలేదు.
గ్లోబల్ టెండర్లు ఫెయిల్ అవ్వటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒకటిరెండు కంపెనీలతో నేరుగా చర్చలు జరిపింది. అయితే టీకాల సరఫరా విషయంలో తాము రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం లేదని స్పష్టంగా చెప్పేశాయి. తాము కేంద్రంతో మాత్రమే ఒప్పందాలు చేసుకుంటామని అక్కడి నుండి రాష్ట్రాలు టీకాలను తెప్పించుకోవాలని తేల్చి చెప్పాయి. దాంతో అంతర్జాతీయంగా ఏ కంపెనీ కూడా గ్లోబల్ టెండర్లలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు లేవని అర్ధమైపోయింది.
చాలా రాష్ట్రాలకు గ్లోబల్ టెండర్లకు టెండర్ దాఖలు తేదీ గురువారంతో ముగిసిన కారణంగా మళ్ళీ గడువును పొడిగించాయి. టెండర్లు దాఖలవుతాయనే నమ్మకం లేకపోయినా గడువను మరో రెండు వారాలు పెంచినట్లు సింఘాల్ చెప్పారు. గ్లోబల్ టెండర్ల ప్రయత్నం ఫెయిలైన కారణంగానే చాలా రాష్ట్రాలు టీకాల కోసం మళ్ళీ కేంద్రాలకు లేఖలు రాస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రంపై ఒత్తిళ్ళు కూడా మొదలుపెట్టేశాయి. మరి టీకా ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాల్సిందే.
This post was last modified on June 4, 2021 11:04 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…