గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చేసిన ఫిర్యాదులో ఎస్పీ పేరు కూడా ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించాలనే కుట్రలో రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నిజానికి ఎంపి ముగ్గురిపై ఫిర్యాదు చేశారు కానీ అందుకు అవసరమైన ఆధారాలను ఎక్కడా చూపలేదు. ఆసుపత్రిలోని మెస్ లో కేపీ రెడ్డి ఏపి పోలీసులకు భోజనం పెట్టించారనే ఓ బిల్లు తప్ప కేపీ రెడ్డి కుట్రకు మరే ఆధారం చూపలేదు. అయితే తన ఫిర్యాదులో ధర్మారెడ్డి, రెగ్యులర్ ఎస్పీ అమ్మిరెడ్డికి వ్యతిరేకంగా ఎంపి ఎలాంటి ఆధారం చూపలేదు. తనపై ఎంపి చేసిన ఆరోపణలపై వ్యక్తిగతంగా ఎస్పీకానీ లేదా ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు.
అయితే హఠాత్తుగా ఎస్పీని ప్రభుత్వం బదిలీచేసింది. తొందరలో బదిలీలు జరుగుతుందని, అందులో అమ్మిరెడ్డికి మంచి పోస్టింగ్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే ఎస్పీని బదిలీ చేయటమే ఆశ్చర్యమంటే పైగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటం మరింత ఆశ్చర్యరంగా ఉంది. ఎస్పీని బదిలీ చేయటం ద్వారా అసలు ప్రభుత్వం ఏమి చెప్పదలచుకుందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
This post was last modified on June 2, 2021 5:09 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…