గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చేసిన ఫిర్యాదులో ఎస్పీ పేరు కూడా ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించాలనే కుట్రలో రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నిజానికి ఎంపి ముగ్గురిపై ఫిర్యాదు చేశారు కానీ అందుకు అవసరమైన ఆధారాలను ఎక్కడా చూపలేదు. ఆసుపత్రిలోని మెస్ లో కేపీ రెడ్డి ఏపి పోలీసులకు భోజనం పెట్టించారనే ఓ బిల్లు తప్ప కేపీ రెడ్డి కుట్రకు మరే ఆధారం చూపలేదు. అయితే తన ఫిర్యాదులో ధర్మారెడ్డి, రెగ్యులర్ ఎస్పీ అమ్మిరెడ్డికి వ్యతిరేకంగా ఎంపి ఎలాంటి ఆధారం చూపలేదు. తనపై ఎంపి చేసిన ఆరోపణలపై వ్యక్తిగతంగా ఎస్పీకానీ లేదా ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు.
అయితే హఠాత్తుగా ఎస్పీని ప్రభుత్వం బదిలీచేసింది. తొందరలో బదిలీలు జరుగుతుందని, అందులో అమ్మిరెడ్డికి మంచి పోస్టింగ్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే ఎస్పీని బదిలీ చేయటమే ఆశ్చర్యమంటే పైగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటం మరింత ఆశ్చర్యరంగా ఉంది. ఎస్పీని బదిలీ చేయటం ద్వారా అసలు ప్రభుత్వం ఏమి చెప్పదలచుకుందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
This post was last modified on June 2, 2021 5:09 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…