గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చేసిన ఫిర్యాదులో ఎస్పీ పేరు కూడా ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించాలనే కుట్రలో రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నిజానికి ఎంపి ముగ్గురిపై ఫిర్యాదు చేశారు కానీ అందుకు అవసరమైన ఆధారాలను ఎక్కడా చూపలేదు. ఆసుపత్రిలోని మెస్ లో కేపీ రెడ్డి ఏపి పోలీసులకు భోజనం పెట్టించారనే ఓ బిల్లు తప్ప కేపీ రెడ్డి కుట్రకు మరే ఆధారం చూపలేదు. అయితే తన ఫిర్యాదులో ధర్మారెడ్డి, రెగ్యులర్ ఎస్పీ అమ్మిరెడ్డికి వ్యతిరేకంగా ఎంపి ఎలాంటి ఆధారం చూపలేదు. తనపై ఎంపి చేసిన ఆరోపణలపై వ్యక్తిగతంగా ఎస్పీకానీ లేదా ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు.
అయితే హఠాత్తుగా ఎస్పీని ప్రభుత్వం బదిలీచేసింది. తొందరలో బదిలీలు జరుగుతుందని, అందులో అమ్మిరెడ్డికి మంచి పోస్టింగ్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే ఎస్పీని బదిలీ చేయటమే ఆశ్చర్యమంటే పైగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటం మరింత ఆశ్చర్యరంగా ఉంది. ఎస్పీని బదిలీ చేయటం ద్వారా అసలు ప్రభుత్వం ఏమి చెప్పదలచుకుందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
This post was last modified on June 2, 2021 5:09 pm
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…