గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చేసిన ఫిర్యాదులో ఎస్పీ పేరు కూడా ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించాలనే కుట్రలో రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
నిజానికి ఎంపి ముగ్గురిపై ఫిర్యాదు చేశారు కానీ అందుకు అవసరమైన ఆధారాలను ఎక్కడా చూపలేదు. ఆసుపత్రిలోని మెస్ లో కేపీ రెడ్డి ఏపి పోలీసులకు భోజనం పెట్టించారనే ఓ బిల్లు తప్ప కేపీ రెడ్డి కుట్రకు మరే ఆధారం చూపలేదు. అయితే తన ఫిర్యాదులో ధర్మారెడ్డి, రెగ్యులర్ ఎస్పీ అమ్మిరెడ్డికి వ్యతిరేకంగా ఎంపి ఎలాంటి ఆధారం చూపలేదు. తనపై ఎంపి చేసిన ఆరోపణలపై వ్యక్తిగతంగా ఎస్పీకానీ లేదా ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు.
అయితే హఠాత్తుగా ఎస్పీని ప్రభుత్వం బదిలీచేసింది. తొందరలో బదిలీలు జరుగుతుందని, అందులో అమ్మిరెడ్డికి మంచి పోస్టింగ్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే ఎస్పీని బదిలీ చేయటమే ఆశ్చర్యమంటే పైగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటం మరింత ఆశ్చర్యరంగా ఉంది. ఎస్పీని బదిలీ చేయటం ద్వారా అసలు ప్రభుత్వం ఏమి చెప్పదలచుకుందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
This post was last modified on June 2, 2021 5:09 pm
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…