వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ యూటర్న్ తీసుకుందా? ఈ విషయంలో చాలా నర్మగర్భంగా వ్యవహరించిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై ఎట్టకేలకు ఇటు సీఎం జగన్, అటు సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేయడం గమనార్హం.
ఈ కౌంటర్లలో జగన్ వాదన ఎలా ఉన్నప్పటికీ.. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ మాత్రం జగన్కు చిర్రెత్తు కొచ్చేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే.. సీబీఐని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ ఇటీవల కాలంలో ప్రయత్నించారనే వాదన ఉంది. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీపై తీవ్రంగా మండి పడుతుంటే.. జగన్ మాత్రం ప్రధానిని వెనుకేసుకు వచ్చారు.
దీంతో తనపై ఉన్న బెయిల్ రద్దు పిటిషన్ను దృష్టిలో పెట్టుకునే.. జగన్ ఇలా ప్రధానిని భుజానికెత్తుకున్నారనే వాదన వచ్చింది. అయితే.. తీరా విషయానికి వచ్చే సరికి.. జగన్కు సీబీఐ పక్కాగా హ్యాండిచ్చేసి నట్టు తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై మెమో దాఖలు చేసిన సీబీఐ.. దీనిలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎంపీ రఘురామ పిటిషన్పై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది.
అంటే.. సీబీఐ కోర్టు.. జగన్ విషయంలో విచారణ కొనసాగించాలని కానీ, వద్దని కానీ, కోరకపోయినా.. కోర్టు నిర్ణయానికే వదిలి వేయడం గమనార్హం. కాగా, కోర్టు ఇప్పటికే.. దీనిని విలువైన పిటిషన్గా పేర్కొనడం గమనార్హం. ఆదిలో విచారణార్హత తేలుస్తామన్న కోర్టు.. తర్వాత.. దీనికి విచారణార్హత ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పుడు సీబీఐ కూడా కర్ర విరగకుండా.. పాము చావకుండా వ్యవహరించడంతో జగన్కు ఉచ్చు బిగుస్తున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. ఈ నెల 14 వరకు ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
This post was last modified on June 1, 2021 6:33 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…