జగన్మోహన్ రెడ్డి నమోదైన అక్రమాస్తుల కేసుల జాబితాలో మరోటి చేరింది. ఇప్పటికే అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ 11 కేసులు, ఈడీ 6 కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులన్నీ గడచిన 12 సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ధిక్కరించి జగన్ పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత కొత్త వైఎస్సార్పీపీ ఏర్పాటు చేసుకున్నారు.
కాంగ్రెస్ ను కాదని బయటకు రాగానే జగన్ పై కేసుల నమోదయ్యాయి. అప్పటి నుండి ఇప్పటివరకు విచారణ సా….గుతూనే ఉన్నాయి. అలాంటి కేసుల జాబితాలో తాజాగా మరోటి చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి హౌసింగ్ బోర్డు+ఇందు ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన హౌసింగ్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అభియోగపత్రాన్ని ఈడీ దాఖలు చేసింది.
తాజా కేసులో జగన్ తో మరో 11 మందిని నింతితులుగా చేర్చింది ఈడీ. నిజానికి తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరిపితమైనవే అని జగన్ మొదటినుండి వాదిస్తున్నారు. జగన్ వాదనకు కాంగ్రెస్ అగ్రనేతల గులాంనబీ ఆజాద్, జై రాం రమేష్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. పై నేతలు మాట్లాడుతు జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటే కేసుల గొడవే ఉండేది కాదని చాలాసార్లు చెప్పారు. వాళ్ళ మాటలను బట్టే జగన్ పై పడిన కేసులన్నీ రాజకీయంగా పెట్టినవే అని అర్ధమవుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన 12 ఏళ్ళుగా కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. అధికారంలో ఉన్న వైఎస్సార్ ను అడ్డంపెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. అయితే అవినీతిలో భాగస్వాములుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారుల పాత్ర లేదని చాలామందిపై కేసులు కొట్టేసింది కోర్టు. అలాగే మంత్రివర్గానికి సంబంధం లేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు సమాధానమిచ్చింది.
ఇన్ని సంవత్సరాలుగా కేసులను విచారణ సంస్ధలు దర్యాప్తు చేస్తున్నా ఒక్క కేసును కూడా ఫైనల్ చేయలేదు. పైగా జగన్ పై ప్రధానంగా వినబడుతున్న క్విడ్ ప్రో కో కేసుల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేశాయి. మరి ఇంకెంత కాలం కేసుల విచారణ జరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో తాజాగా మరో కేసు నమోదైందంటే దీని విచారణ ఇంకెంత కాలం సాగుతుందో చూడాలి.
This post was last modified on May 30, 2021 1:31 pm
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…
ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ…
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…