జగన్మోహన్ రెడ్డి నమోదైన అక్రమాస్తుల కేసుల జాబితాలో మరోటి చేరింది. ఇప్పటికే అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ 11 కేసులు, ఈడీ 6 కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులన్నీ గడచిన 12 సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ధిక్కరించి జగన్ పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత కొత్త వైఎస్సార్పీపీ ఏర్పాటు చేసుకున్నారు.
కాంగ్రెస్ ను కాదని బయటకు రాగానే జగన్ పై కేసుల నమోదయ్యాయి. అప్పటి నుండి ఇప్పటివరకు విచారణ సా….గుతూనే ఉన్నాయి. అలాంటి కేసుల జాబితాలో తాజాగా మరోటి చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి హౌసింగ్ బోర్డు+ఇందు ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన హౌసింగ్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అభియోగపత్రాన్ని ఈడీ దాఖలు చేసింది.
తాజా కేసులో జగన్ తో మరో 11 మందిని నింతితులుగా చేర్చింది ఈడీ. నిజానికి తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరిపితమైనవే అని జగన్ మొదటినుండి వాదిస్తున్నారు. జగన్ వాదనకు కాంగ్రెస్ అగ్రనేతల గులాంనబీ ఆజాద్, జై రాం రమేష్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. పై నేతలు మాట్లాడుతు జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటే కేసుల గొడవే ఉండేది కాదని చాలాసార్లు చెప్పారు. వాళ్ళ మాటలను బట్టే జగన్ పై పడిన కేసులన్నీ రాజకీయంగా పెట్టినవే అని అర్ధమవుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన 12 ఏళ్ళుగా కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. అధికారంలో ఉన్న వైఎస్సార్ ను అడ్డంపెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. అయితే అవినీతిలో భాగస్వాములుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారుల పాత్ర లేదని చాలామందిపై కేసులు కొట్టేసింది కోర్టు. అలాగే మంత్రివర్గానికి సంబంధం లేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు సమాధానమిచ్చింది.
ఇన్ని సంవత్సరాలుగా కేసులను విచారణ సంస్ధలు దర్యాప్తు చేస్తున్నా ఒక్క కేసును కూడా ఫైనల్ చేయలేదు. పైగా జగన్ పై ప్రధానంగా వినబడుతున్న క్విడ్ ప్రో కో కేసుల్లో కొన్నింటిని కోర్టులు కొట్టేశాయి. మరి ఇంకెంత కాలం కేసుల విచారణ జరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో తాజాగా మరో కేసు నమోదైందంటే దీని విచారణ ఇంకెంత కాలం సాగుతుందో చూడాలి.
This post was last modified on May 30, 2021 1:31 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…