సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనంగా మారటమే కాదు.. మరీ ఇంత దారుణమా అన్న చర్చకు తెర తీసిన గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగిందో తేల్చటమే కాదు.. బాధితురాలు ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన యువతిని.. ఆ దేశానికి చెందిన వారే చిత్ర హింసలకు గురి చేసి సామూహిక అత్యాచారం చేయటం.. ఈ దారుణ ఉదంతంలో ఇద్దరు అమ్మాయిలు యువకులకు సహకారాన్ని అందించటం షాకింగ్ గా మారింది. ఈ మొత్తం ఉదంతం ఈశాన్య రాష్ట్రమైన అసోంలో జరిగినట్లుగా ప్రచారం జరిగినా.. ఇది జరిగింది గార్డెన్ సిటీగా పేరున్న బెంగళూరులో జరిగినట్లుగా గుర్తించారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో అటు బంగ్లాదేశ్ లోనూ.. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వైరల్ గా మారి పెను సంచలనమైంది. అసోం పోలీసులు బెంగళూరు పోలీసుల్ని అలెర్టు చేయటంతో.. నగరంలోని రామ్మూర్తి నగర ఎన్ఆర్ ఐ లేఔట్ లోని ఒక ఇంట్లో ఈ అమానుష ఘటన జరిగినట్లుగా గుర్తించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు యువకులతో పాటు.. ఇద్దరు యువతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా.. బంగ్లాదేశ్ కు చెందిన వారేనని.. అక్రమంగా దేశ సరిహద్దులు దాటి బెంగళూరులో మకాం వేసినట్లుగా గుర్తించారు.
నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా ఇద్దరిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వారు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ గ్యాంగ్ రేప్ లో బాధితురాలైన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఆమె కేరళలో ఉన్నట్లుగా తేలింది.
వెంటనే స్పందించిన పోలీసులు కేరళకు వెళ్లి ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చారు. దేశ సరిహద్దులు దాటేసి.. దర్జాగా ఒక మహానగరంలో తిష్ట వేసిన వైనం చూస్తే.. ఈ లెక్కన దేశంలోని మహానగరాల్లో ఇలా అనుమతి లేని వారెందరన్న సందేహాం రాక మానదు. మరి.. ఇలాంటి వారిని గుర్తించే విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? అన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.
This post was last modified on May 29, 2021 11:53 am
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…