కరోనా వైరస్ కు విరుగుడుగా ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేధం మందు ఫార్మాలా చెప్పాలని వేధింపులు మొదలయ్యాయా ? అవుననే అంటున్నారు ఆనందయ్య. ఈ మేరకు కోర్టులో పిటీషన్ కూడా వేశారు. తాను వాడుతున్న మందులోని దినుసుల వివరాలు చెప్పాలని, వాటిని మిక్స్ చేసే ఫార్ములాను చెప్పాలని తన అధికారులు వేదిస్తున్నట్లు ఆనందయ్య తన పిటీషన్లో ఆరోపించారు.
కరోనా మందు పంపిణీ కార్యక్రమాల్లో అధికారుల జోక్యం లేకుండా చూడాలంటు ఆనందయ్య వేసిన కేసును హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే నాటుమందు పంపిణీ విషయంలో అనేకమంది కోర్టులో కేసులు వేశారు. వేసిన కేసులన్నీ ఆనందయ్యకు అనుకూలంగా దాఖలైనవి కావటం గమనార్హం. కేసులను విచారిస్తున్న కోర్టు కూడ ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆనందయ్య మందును పరిశీలించిన ఆయుష్ ఉన్నతాధికారులు అందులో ఎలాంటి హానికారకమైన వస్తువులు దినుసులు లేవని స్పష్టం చేశారు. అలాగే కేంద్రప్రభుత్వానికి చెందిన మరో సంస్ధ కూడా నాటుమందుపై అధ్యయనం చేస్తోంది. ఇదే సమయంలో టీటీడీ కూడా తన ఆయుర్వేద కాలేజీ ల్యాబ్ లో ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందును పరీక్షించింది.
ఎక్కడ ఎవరు మందును పరీక్షించినా అందులో వాడే దినుసులు, వస్తువులు హానికరం కాదనే చెబుతున్నారు. మందులో ఎలాంటి హానికరమైన దినుసులు లేనపుడు ఆనందయ్య మందును ఎందుకు ప్రభుత్వం అడ్డుకుందో ఎవరికీ అర్ధం కావటంలేదు. అధికార+ప్రతిపక్షాల నేతలంతా ఆనందయ్య ముందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. అలాగే మందు తీసుకోవటానికి జనాలు రెడీగా ఉన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఏదో కారణంతో జాప్యం చేస్తునే ఉంది. ఇంతలోనే మందు ఫార్ముల చెప్పాలనే వేధింపులు మొదలైనట్లు ఆనందయ్య ఆరోపించటం సంచలనంగా మారింది.
This post was last modified on May 30, 2021 11:04 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…