రాజకీయాల్లో మిత్రులైన తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , ఏపీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య పరిపాలన సహా అనేక అంశాల గురించి పోలిక ఉండే సంగతి తెలిసిందే . వివిధ అంశాల్లో ఈ ఇద్దరు నేతల నిర్ణయాలు , వైఖరి సహజంగానే ప్రజలు విశ్లేషించుకునేందుకు చాన్స్ ఇస్తుంటాయి. ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ యొక్క వైఖరి చర్చకు తెరలేపింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించకపోవడంపై ఆ రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలు పాటించడాన్ని పరిశీలించి వాటిని ఉల్లంఘిస్తున్న గుంటూరులో 52 కొవిడ్ ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝులిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ.1.25కోట్ల జరిమానా విధించారు. సహజంగానే ఈ వార్త పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో చర్చకు తెరలేపింది.
హైదరాబాద్లో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు హాస్పిటల్లలో అనేకం నిబంధనలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. చికిత్స భారీ ఫీజులు వసూలు చేయడం నుంచి మొదలుకొని చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చివరి చూపు కోసం శవం అప్పగించే వరకు రోజుకు పదుల సంఖ్యలో వార్తలు మీడియాలో , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు బాధితుల ఆవేదన ఎందరినో కలచివేస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు శూన్యమని పలువురు భగ్గుమంటున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ సర్కారు దూకుడుగా ముందుకు సాగి భారీ ఫైన్లు వేసింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.
This post was last modified on May 27, 2021 7:15 pm
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…