Political News

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు.. కాకుంటే అలా సడలింపు



తెలంగాణలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియనుంది. అంటే.. మరో మూడు రోజులు. ఆదివారంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. మరి.. తర్వాత ఏం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. గతంతో పోలిస్తే.. కొవిడ్ కేసులపైనా.. దాని తీవ్రత మీదా.. చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.
గతంలో లాక్ డౌన్ అన్నంతనే.. రాష్ట్రానికి పోయే ఆదాయం గురించి ప్రస్తావన వచ్చేదని.. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం ప్రజల ఆరోగ్యం గురించి సీఎం కేసీఆర్ మాటల్లో వినిపిస్తోందని చెబుతున్నారు. అనారోగ్యాన్ని పెంచుకుంటూ పోయే కన్నా.. ఆర్థికంగా కొంత నష్టం జరిగినా.. ప్రజలు ఆరోగ్యంగా ఉండటం మంచిదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. మరో ఆలోచన లేకుండా లాక్ డౌన్ పొడిగించారని.. తాజాగా మరోసారి పొడిగింపు ఉంటుందని చెబుతున్నారు.

ఈ నెల 30నుంచి వచ్చే నెల 15 వరకు లేదంటే 10 వరకు అయితే పొడిగింపు నిర్ణయాన్ని 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ఫలితం రావటమే కాదు.. రాష్ట్రంలో కేసుల తీవ్రత తగ్గుతుందని.. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే వీలుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈసారి లాక్ డౌన్ పొడిగింపు వేళలో.. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వీలుందని చెబుతున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ ను ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు మినహాయింపు ఇవ్వటం.. ఈ టైంలో అన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపారాల్ని నిర్వహించుకోవటానికి వీలు కల్పించటం తెలిసిందే. తాజాగా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. ఉదయం 10 గంటల వరకు ఉన్న పొడిగింపును మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచే వీలుందని తెలుస్తోంది. అలా చేయటం ద్వారా.. వ్యాపార వర్గాల వారికి.. మిగిలిన వారికి అంతో ఇంతో వెసులు బాటు ఉంటుందని చెబుతున్నారు. ఈ పొడిగింపుతో వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని రోజులు లాక్ డౌన్ విధించాలా? లేదా? అన్న నిర్ణయం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on May 27, 2021 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

29 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago