ఏపీ సీఎం.. జగన్కు ఉన్న ఛాన్స్ కేవలం రెండేళ్లు..! వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదేళ్ల పాలన అం ది వస్తుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో అందునా.. ఏపీ వంటి కీలక రాజకీయాలు జరుగుతున్న రాష్ట్రంలో అధికార పార్టీకి దక్కేవి కేవలం 4 సంవత్సరాలే అనడంలో ఎలాంటి అతిశయోక్తీ ఉండదు. గత చంద్రబాబు పాలనలోనూ చివరి ఆరు మాసాలు ఆయన ఎన్నికల వ్యూహాలకే పరిమితం అయ్యారు. ఇక, ఇప్పుడు జగన్.. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. దీంతో మూడేళ్ల పాలన కళ్లముందు కనిపిస్తోంది.
కానీ, వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. కేవలం రెండేళ్లు మాత్రమే జగన్కు చేతిలో ఉన్న అవకాశంగా పేర్కొంటు న్నారు పరిశీలకులు. ఈ రెండేళ్లలోనే ఆయన చేయాల్సినంతా చేయాలి. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలకు కూడా రాజకీయంగా కాకుండా.. తన పనితీరు ఆధారంగా సమాధానం చెప్పాలి. వాస్తవానికి ఇప్పుడు ప్రతిపక్షం ఓట్ల రాజకీయాల్లో ఓడిపోతున్నా.. మాటల విషయంలోనూ.. చేతల విషయంలోనూ.. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబు సహా ఆయన కుమారుడు, నాయకులు.. తీవ్రస్థాయిలో జగన్పై విరుచుకుపడుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ.. తిరుపతి ఎన్నికలోనూ పరాజయం ఎదురైన తర్వాత.. టీడీపీ పరిస్థితి ఘోరంగా మారుతుందని.. ఆ పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు కూడా కరువవుతారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ ఓటములు తమకు కావని అనుకున్నారో.. లేక.. మాట తూ లకపోతే.. తక్కువ అయిపోతామని లెక్కలు వేసుకున్నారో.. తెలియదు కానీ, దూకుడు మాత్రం తగ్గించలే దు. ఈ పరిణామం.. వైసీపీని ఇరుకున పెడుతోంది. మరోవైపు.. అప్పులు.. పెరుగుతున్న ద్రవ్యలోటు వంటివి కూడా వైసీపీ సర్కారుకు ఇప్పుడు ప్రతిబంధకంగా మారుతున్నాయి.
మరోవైపు.. వ్యతిరేక మీడియా భారీ ఎత్తున జగన్ను డైల్యూట్ చేసేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్న తీరు కూడా ఎన్నికల సమయానికి పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా నాయకులను తయారు చేసుకుని ముందుకు సాగాలనే వ్యూహం మంచిదే అయినప్పటికీ.. పాత వారిని ఎలా దారిలో పెట్టుకోవాలనేది కీలకంగా మారిన విషయం.. ఇన్ని పరిణామాలను గమనిస్తే.. వచ్చే రెండేళ్లు మాత్రమే.. వైసీపీకి కీలకమని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు పథకాలు.. మరోవైపు ప్రతిపక్షాల మాటల తూటాలు, వ్యతిరేక ప్రచారం వంటివి తట్టుకుని ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on May 27, 2021 3:11 pm
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…