అవును నరేంద్రమోడి సర్కార్ చేసిన తప్పిదం కారణంగా ఫైజర్, మోడెర్నా టీకాలకు ఇప్పట్లో భారత్ కు వచ్చే అవకాశం లేదు. తమ టీకాలు భారత్ లోకి అందుబాటులోకి రావాలంటే 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అంటు పై రెండు సంస్ధల ప్రతినిధులు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కు స్పష్టగా చెప్పేశారట. ఒకపుడు పై రెండు సంస్ధలు తమ టీకాలను విడుదల చేయటానికి కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాయి.
అయితే అత్యవసర వినియోగం కింద భారత్ లో రిలీజ్ చేయటానికి అప్పట్లో కేంద్రం అంగీకరించలేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే కానీ ఫైజర్, మోడెర్నా టీకాలను భారత్ మార్కెట్లోకి విడదలకు అనుమతించేది లేదని తెగేసి చెప్పింది. విచిత్రమేమిటంటే ఇపుడు మార్కెట్లో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు కూడా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే కేంద్రం మార్కెట్లోకి రిలీజ్ చేసేసింది.
కేంద్రం ఎప్పుడైతే క్లినికల్ ట్రయల్స్ నిబంధనను గట్టిగా చెప్పిందో పై రెండు కంపెనీలు భారత్ కు గుడ్ బై చెప్పేశాయి. అయితే కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయెటెక్ అయినా కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ కంపెనీ అయినా డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. దాంతో దేశం మొత్తంమీద టీకాలకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది.
జనాల నుండి వస్తున్న ఒత్తిళ్ళు, ఆరోపణలను తట్టుకోలేక చివరకు కేంద్రం విదేశీ కంపెనీలను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే ఫైజర్, మోడెర్నా ప్రతినిధులతో జై శంకర్ భేటీ అయ్యారు. దేశంలో పరిస్దితులను వివరించి వెంటనే టీకాలను మార్కెట్లోకి తీసుకురమ్మన్నారు. అయితే ఆయన ఆహ్వానాన్ని సంస్ధలు తిరస్కరించాయి. తమకు ఆర్డర్లిచ్చిన దేశాలకు టీకాలను అందించాలంటేనే చాలా సమయం పడుతుందన్నారు.
అమెరికా సహా యురోపు దేశాలు ఇప్పటికే వందల మిలియన్ డోసులకు అడ్వాన్సులిచ్చిన విషయాన్ని ప్రతినిధులు ప్రస్తావించారు. వాటికి టీకాలు ఇవ్వాలంటేనే మరో రెండేళ్ళు పడుతుందన్నారు. కాబట్టి ఏ లెక్క చూసుకున్నా భారత్ లో తమ టీకాలు రిలీజ్ చేయాలంటే కనీసం 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అని తెగేసి చెప్పారట. కేంద్రప్రభుత్వం వ్యవహారం ఎలాగుందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది.
This post was last modified on May 26, 2021 12:19 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…