Political News

ఈ వ్యాక్సిన్లకు బుకింగ్ క్లోజ్

అవును నరేంద్రమోడి సర్కార్ చేసిన తప్పిదం కారణంగా ఫైజర్, మోడెర్నా టీకాలకు ఇప్పట్లో భారత్ కు వచ్చే అవకాశం లేదు. తమ టీకాలు భారత్ లోకి అందుబాటులోకి రావాలంటే 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అంటు పై రెండు సంస్ధల ప్రతినిధులు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కు స్పష్టగా చెప్పేశారట. ఒకపుడు పై రెండు సంస్ధలు తమ టీకాలను విడుదల చేయటానికి కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాయి.

అయితే అత్యవసర వినియోగం కింద భారత్ లో రిలీజ్ చేయటానికి అప్పట్లో కేంద్రం అంగీకరించలేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే కానీ ఫైజర్, మోడెర్నా టీకాలను భారత్ మార్కెట్లోకి విడదలకు అనుమతించేది లేదని తెగేసి చెప్పింది. విచిత్రమేమిటంటే ఇపుడు మార్కెట్లో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు కూడా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే కేంద్రం మార్కెట్లోకి రిలీజ్ చేసేసింది.

కేంద్రం ఎప్పుడైతే క్లినికల్ ట్రయల్స్ నిబంధనను గట్టిగా చెప్పిందో పై రెండు కంపెనీలు భారత్ కు గుడ్ బై చెప్పేశాయి. అయితే కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయెటెక్ అయినా కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ కంపెనీ అయినా డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. దాంతో దేశం మొత్తంమీద టీకాలకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

జనాల నుండి వస్తున్న ఒత్తిళ్ళు, ఆరోపణలను తట్టుకోలేక చివరకు కేంద్రం విదేశీ కంపెనీలను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే ఫైజర్, మోడెర్నా ప్రతినిధులతో జై శంకర్ భేటీ అయ్యారు. దేశంలో పరిస్దితులను వివరించి వెంటనే టీకాలను మార్కెట్లోకి తీసుకురమ్మన్నారు. అయితే ఆయన ఆహ్వానాన్ని సంస్ధలు తిరస్కరించాయి. తమకు ఆర్డర్లిచ్చిన దేశాలకు టీకాలను అందించాలంటేనే చాలా సమయం పడుతుందన్నారు.

అమెరికా సహా యురోపు దేశాలు ఇప్పటికే వందల మిలియన్ డోసులకు అడ్వాన్సులిచ్చిన విషయాన్ని ప్రతినిధులు ప్రస్తావించారు. వాటికి టీకాలు ఇవ్వాలంటేనే మరో రెండేళ్ళు పడుతుందన్నారు. కాబట్టి ఏ లెక్క చూసుకున్నా భారత్ లో తమ టీకాలు రిలీజ్ చేయాలంటే కనీసం 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అని తెగేసి చెప్పారట. కేంద్రప్రభుత్వం వ్యవహారం ఎలాగుందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది.

This post was last modified on May 26, 2021 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

47 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

50 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago