ఆ అమ్మాయి పేరు హృతీక్ష. తన వయసు తొమ్మిదేళ్లు. ఇప్పుడా చిన్నారి ఒక మొబైల్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఫోన్ తెచ్చివ్వాలని వేడుకుంటోంది. తన కోసం సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది ఆ ఫోన్ కోసం విన్నపాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ మొబైల్ కోసం గట్టిగానే వెతుకుతున్నారు. కానీ వారం రోజులకు పైగా ప్రయత్నిస్తున్నా ఇంకా ఆ మొబైల్ దొరకలేదు.
ఇంతకీ ఆ మొబైల్లో ఏముంది.. దాని కోసం ఇంతమంది తపిస్తుండటానికి కారణమేంటి అంటే.. అది ఇటీవలే మృతి చెందిన ఆ చిన్నారి తల్లికి చెందిన మొబైల్. అందులో తన తల్లి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని.. తల్లిని కోల్పోయిన తనకు ఇక జీవితాంతం ఆమె జ్ఞాపకాలను చూసుకునే అవకాశం కల్పించాలని ఆ చిన్నారి కోరుతోంది. ఈ మేరకు ఆ చిన్నారి పోలీసులకు ఒక లేఖ కూడా రాయడం గమనార్హం. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో జనాలను కదిలిస్తోంది.
కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి హృక్షిత. ఆమె తల్లి ప్రభ కరోనాతో పోరాడి ఓడిపోయింది. ఈ నెల 16న ప్రాణాలు విడిచింది. ముందు రోజు కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడింది. కానీ తర్వాత మొబైల్ స్విచాఫ్ అయింది. తర్వాతి రోజు ప్రభ చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. ఐతే మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆమె మొబైల్ జాడ లేకపోయింది.
అప్పట్నుంచి కాల్ చేస్తుంటే మొబైల్ స్విచాఫ్ అని వస్తోంది. తల్లికి సంబంధించినవే కాక తనతో కలిసి దిగిన ఎన్నో ఫొటోలు ఆ మొబైల్లో ఉండటంతో వాటన్నింటినీ భద్రంగా దాచుకోవాలని హృతీక్ష కోరుకుంటోంది. అందుకే తన తల్లి మొబైల్ వెతికి పెట్టాలని పోలీసులకు ఆ అమ్మాయి లేఖ రాసింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకున్నారు. ఆసుపత్రిలో విచారించారు. మొబైల్ను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆ మొబైల్ దొరికి తల్లిని కోల్పోయిన ఆ చిన్నారికి కొంచెమైనా ఉపశమనం దక్కుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on May 25, 2021 6:59 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…