ఆ అమ్మాయి పేరు హృతీక్ష. తన వయసు తొమ్మిదేళ్లు. ఇప్పుడా చిన్నారి ఒక మొబైల్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఫోన్ తెచ్చివ్వాలని వేడుకుంటోంది. తన కోసం సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది ఆ ఫోన్ కోసం విన్నపాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ మొబైల్ కోసం గట్టిగానే వెతుకుతున్నారు. కానీ వారం రోజులకు పైగా ప్రయత్నిస్తున్నా ఇంకా ఆ మొబైల్ దొరకలేదు.
ఇంతకీ ఆ మొబైల్లో ఏముంది.. దాని కోసం ఇంతమంది తపిస్తుండటానికి కారణమేంటి అంటే.. అది ఇటీవలే మృతి చెందిన ఆ చిన్నారి తల్లికి చెందిన మొబైల్. అందులో తన తల్లి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని.. తల్లిని కోల్పోయిన తనకు ఇక జీవితాంతం ఆమె జ్ఞాపకాలను చూసుకునే అవకాశం కల్పించాలని ఆ చిన్నారి కోరుతోంది. ఈ మేరకు ఆ చిన్నారి పోలీసులకు ఒక లేఖ కూడా రాయడం గమనార్హం. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో జనాలను కదిలిస్తోంది.
కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి హృక్షిత. ఆమె తల్లి ప్రభ కరోనాతో పోరాడి ఓడిపోయింది. ఈ నెల 16న ప్రాణాలు విడిచింది. ముందు రోజు కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడింది. కానీ తర్వాత మొబైల్ స్విచాఫ్ అయింది. తర్వాతి రోజు ప్రభ చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. ఐతే మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆమె మొబైల్ జాడ లేకపోయింది.
అప్పట్నుంచి కాల్ చేస్తుంటే మొబైల్ స్విచాఫ్ అని వస్తోంది. తల్లికి సంబంధించినవే కాక తనతో కలిసి దిగిన ఎన్నో ఫొటోలు ఆ మొబైల్లో ఉండటంతో వాటన్నింటినీ భద్రంగా దాచుకోవాలని హృతీక్ష కోరుకుంటోంది. అందుకే తన తల్లి మొబైల్ వెతికి పెట్టాలని పోలీసులకు ఆ అమ్మాయి లేఖ రాసింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకున్నారు. ఆసుపత్రిలో విచారించారు. మొబైల్ను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆ మొబైల్ దొరికి తల్లిని కోల్పోయిన ఆ చిన్నారికి కొంచెమైనా ఉపశమనం దక్కుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on May 25, 2021 6:59 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…