ఆ అమ్మాయి పేరు హృతీక్ష. తన వయసు తొమ్మిదేళ్లు. ఇప్పుడా చిన్నారి ఒక మొబైల్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఫోన్ తెచ్చివ్వాలని వేడుకుంటోంది. తన కోసం సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది ఆ ఫోన్ కోసం విన్నపాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ మొబైల్ కోసం గట్టిగానే వెతుకుతున్నారు. కానీ వారం రోజులకు పైగా ప్రయత్నిస్తున్నా ఇంకా ఆ మొబైల్ దొరకలేదు.
ఇంతకీ ఆ మొబైల్లో ఏముంది.. దాని కోసం ఇంతమంది తపిస్తుండటానికి కారణమేంటి అంటే.. అది ఇటీవలే మృతి చెందిన ఆ చిన్నారి తల్లికి చెందిన మొబైల్. అందులో తన తల్లి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని.. తల్లిని కోల్పోయిన తనకు ఇక జీవితాంతం ఆమె జ్ఞాపకాలను చూసుకునే అవకాశం కల్పించాలని ఆ చిన్నారి కోరుతోంది. ఈ మేరకు ఆ చిన్నారి పోలీసులకు ఒక లేఖ కూడా రాయడం గమనార్హం. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో జనాలను కదిలిస్తోంది.
కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి హృక్షిత. ఆమె తల్లి ప్రభ కరోనాతో పోరాడి ఓడిపోయింది. ఈ నెల 16న ప్రాణాలు విడిచింది. ముందు రోజు కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడింది. కానీ తర్వాత మొబైల్ స్విచాఫ్ అయింది. తర్వాతి రోజు ప్రభ చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. ఐతే మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆమె మొబైల్ జాడ లేకపోయింది.
అప్పట్నుంచి కాల్ చేస్తుంటే మొబైల్ స్విచాఫ్ అని వస్తోంది. తల్లికి సంబంధించినవే కాక తనతో కలిసి దిగిన ఎన్నో ఫొటోలు ఆ మొబైల్లో ఉండటంతో వాటన్నింటినీ భద్రంగా దాచుకోవాలని హృతీక్ష కోరుకుంటోంది. అందుకే తన తల్లి మొబైల్ వెతికి పెట్టాలని పోలీసులకు ఆ అమ్మాయి లేఖ రాసింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకున్నారు. ఆసుపత్రిలో విచారించారు. మొబైల్ను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆ మొబైల్ దొరికి తల్లిని కోల్పోయిన ఆ చిన్నారికి కొంచెమైనా ఉపశమనం దక్కుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on May 25, 2021 6:59 am
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…