Political News

మూడో వేవ్ లో అన్నా జాగ్రత్త పడుతుందా ?

సెకెండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రతను సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. అన్నీ రాష్ట్రప్రభుత్వాలు విఫలమైనట్లే ఏపి కూడా ఫెయిలైందని సమర్ధించుకుంటే సరిపోదు. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కిందే పరిగణించాలి. సరే జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటే కనీసం థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకైనా ముందునుండే రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.

తొందరలోనే థర్డ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడబోతోందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. సెకెండ్ వేవే ఇంత భయకరంగా ఉంటే ఇక థర్డ్ వేవ్ తీవ్రత ఇంకెలాగుంటుందో ఊహించేందుకే భయంగా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటినుండే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ముందజాగ్రత్తలు మొదలుపెట్టేశాయి.

పిల్లలమీద కరోనా వైరస్ తీవ్రత పడకూడదంటు ఇప్పటినుండే పీడియాట్రిక్స్ ఆసుపత్రులను, వార్డులను రెడీ చేసుకోవాలి. పీడియాట్రిక్స్ నిపుణులతో ఓ కమిటి వేసి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సలహాలు తీసుకోవాలి. వాళ్ళ సూచనల ప్రకారం అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి. ప్రతి జిల్లాలోను అవకాశం ఉంటే పెద్ద పట్టాణాల్లో కూడా పిల్లల కోసమే ప్రత్యేక ఆసుపత్రులను రెడీచేయాలి. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల్లోనే పిల్లల కోసం ఏర్పాట్లు చేయాలి.

పిల్లల వైద్య నిపుణులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటంతో పాటు అవసరమైన నిపుణులను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ప్రైవేటు డాక్టర్లను కూడా పిల్లల వైద్య అవసరాల కోసం ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఈ మేరకు ముందుగానే డాక్టర్ల అసోసియేషన్లతో సమావేశమవ్వాలి. అందుకు డాక్టర్లకు అవసరమైన సౌకర్యాలను అన్నీ ఆసుపత్రులు, వార్డుల్లో ఏర్పాట్లు చేయాలి.

ఆక్సిజన్ ప్లాంట్లను రెడీ చేసుకోవటమే కాకుండా ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకోవాలి. అన్నీ రాష్ట్రాలు రెడీ అవుతున్న పద్దతులేంటో తెలుసుకుని జగన్ సర్కార్ కూడా అందుకు సిద్ధంగా ఉండాలి.

This post was last modified on May 24, 2021 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సితారే జమీన్ పర్.. ఈసారి కన్నీళ్లు కాదు

ఆమిర్ ఖాన్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ ఆయన సినిమాల్లో ‘తారే జమీన్ పర్’ చాలా స్పెషల్.…

5 hours ago

భారత్ సంచలనం : పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళిపోవాలి!

కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను…

9 hours ago

వెంకీ & నాని మల్టీస్టారర్ మిస్సయ్యిందా

పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…

9 hours ago

గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…

11 hours ago

వీళ్లు మ‌నుషులు కాదు మృగాలు: చంద్ర‌బాబు

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమ్మ‌న‌బ్రోలుకు చెందిన టీడీపీ నాయ‌కుడు వీర‌య్య చౌద‌రి దారుణ హ‌త్య‌పై సీఎం…

12 hours ago

రాజా సాబ్ కానుక సరే మరి శుభవార్త ?

ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…

12 hours ago