తెలుగుదేశంపార్టీ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే మహానాడు ఈసారి కూడా జరగటంలేదు. కరోనా వైరస్ నేపధ్యంలో పోయిన ఏడాది వర్చువల్ గా మాత్రమే రెండు రోజుల సమావేశాలు నిర్వహించారు. మరి ఇపుడు కూడా అలాగే వర్చువల్ గానే నిర్వహించాలని డిసైడ్ చేశారు. కాకపోతే రెండు రోజుల సమావేశాలా ? లేకపోతే మే 28వ తేదీన మాత్రమే నిర్వహించాలా ? అన్నదే స్పష్టంకాలేదు.
మే 28వ తేదీన టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవటం పార్టీ పెట్టినదగ్గర నుండి ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం జరుపుతునే ఉన్నారు. కాకపోతే ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అంటే తుపానులు, ఎన్నికల్లాంటి సందర్భాల్లో మాత్రమే మహానాడును నిర్వహించలేకపోయారు.
2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మహానాడును నిర్వహించలేదు. మహానాడు నిర్వహణ ఏర్పాట్లకు సరిపడా వ్యవధిలేని కారణంగా అప్పట్లో పార్టీ పండుగ జరపలేదు. ఇక తర్వాత సంవత్సరం కరోనా వైరస్ సమస్య మొదలైపోయింది. అదే సమస్య ఇపుడు కూడా కంటిన్యు అవుతున్న కారణంగా కేవలం వర్చువల్ గా మాత్రమే నిర్వహించాలని స్ధూలంగా డిసైడ్ అయ్యింది. కాకపోతే ఎన్ని రోజులన్నదే తేలాలి.
This post was last modified on May 24, 2021 11:16 am
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…