Political News

ఈసారీ మహానాడు లేనట్లేనా ?

తెలుగుదేశంపార్టీ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే మహానాడు ఈసారి కూడా జరగటంలేదు. కరోనా వైరస్ నేపధ్యంలో పోయిన ఏడాది వర్చువల్ గా మాత్రమే రెండు రోజుల సమావేశాలు నిర్వహించారు. మరి ఇపుడు కూడా అలాగే వర్చువల్ గానే నిర్వహించాలని డిసైడ్ చేశారు. కాకపోతే రెండు రోజుల సమావేశాలా ? లేకపోతే మే 28వ తేదీన మాత్రమే నిర్వహించాలా ? అన్నదే స్పష్టంకాలేదు.

మే 28వ తేదీన టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవటం పార్టీ పెట్టినదగ్గర నుండి ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం జరుపుతునే ఉన్నారు. కాకపోతే ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అంటే తుపానులు, ఎన్నికల్లాంటి సందర్భాల్లో మాత్రమే మహానాడును నిర్వహించలేకపోయారు.

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మహానాడును నిర్వహించలేదు. మహానాడు నిర్వహణ ఏర్పాట్లకు సరిపడా వ్యవధిలేని కారణంగా అప్పట్లో పార్టీ పండుగ జరపలేదు. ఇక తర్వాత సంవత్సరం కరోనా వైరస్ సమస్య మొదలైపోయింది. అదే సమస్య ఇపుడు కూడా కంటిన్యు అవుతున్న కారణంగా కేవలం వర్చువల్ గా మాత్రమే నిర్వహించాలని స్ధూలంగా డిసైడ్ అయ్యింది. కాకపోతే ఎన్ని రోజులన్నదే తేలాలి.

This post was last modified on May 24, 2021 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago