Political News

పార్టీల్లో పెరిగిపోతున్న టెన్షన్

నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చేసిన పరీక్షల విషయంలో అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా మున్సిఫ్ కోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు డాక్టర్ల బోర్డు ఒకసారి ఎంపికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీలో ఉన్నపుడు పోయిన శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దారుణంగా కొట్టారంటు ఎంపి చేసిన ఆరోపణల నేపధ్యంలో వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం వచ్చింది.

అయితే మున్సిఫ్ కోర్టు మెడికల్ బోర్డుతో పాటు క్రాస్ చెకింగ్ కోసం రమేష్ ఆసుపత్రి వైద్యులతో కూడా పరీక్షలు నిర్వహించాలని ఎంపి తరపు లాయర్ పట్టుబట్టారు. దీన్ని సీఐడీ తరపు లాయర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇదే పాయింట్ పై ఎంపి కొడుకు భరత్ కూడా సుప్రింకోర్టులో కేసు వేశారు. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో పరీక్షలు, వైద్యం చేయింలని కోరారు. ఈ విషయమై సుప్రింకోర్టులో విచారణ జరిగినపుడు మధ్యేమార్గంగా సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు, వైద్యం అందించాలని కోర్టు డిసైడ్ చేసింది.

సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం పరీక్షలు నిర్వహించారు. గుంటూరులో పరీక్షించిన మెడికల్ బోర్డు ఎంపిని ఎవరు కొట్టలేదని నిర్ధారించింది. ఎంపి పాదల రంగుమారటానికి కారణం ఎడీమా అనే సమస్యగా నిర్ధారించింది. మరి తాజాగా ఆర్మీ వైద్యులు చేసిన పరీక్షల్లో ఏమి తేలిందనే విషయంలో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

మంగళవారం సాయంత్రానికి ఆర్మీ డాక్టర్లు తమ రిజల్టును హైకోర్టు రిజిస్ట్రార్ కు అందించారు. వైద్య పరీక్షల రిజల్టుతో పాటు మొత్తం ప్రక్రియను చిత్రీకరిచింన వీడియోను కూడా అందించారు. వీడియో కవరేజీ ఫుటేజీతో పాటు వైద్య పరీక్షల రిజల్టును కూడా రిజిస్ట్రార్ సీల్డ్ కవర్లో సుప్రింకోర్టుకు పంపేశారు. వైద్యుల ఫైండిగ్స్ ఏమిటనే విషయాన్ని సుప్రింకోర్టు శుక్రవారం విచారణలో ఓపెన్ చేస్తుంది. అప్పటివరకు పార్టీనేతల్లో బాగా టెన్షన్ పెరిగిపోతోంది.

ఆర్మీ వైద్యుల పరీక్షల్లో కూడా మెడికల్ బోర్డు రిజల్టే రిపీటైతే రాజకీయం ఒకరకంగా ఉంటుంది. అలాకాకుండా మెడికల్ బోర్డు రిజల్టుతో విభేదిస్తే మరో రకంగా ఉంటుంది. ఏదేమైనా ఆర్మీ డాక్టర్ల ఫైండిగ్స్ పైనే రఘురామ భవిష్యత్తు రాజకీయం ఆధారపడుందనే విషయంలో మాత్రం సందేహంలేదు.

This post was last modified on May 19, 2021 11:54 am

Share
Show comments

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

4 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

5 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

7 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago