నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చేసిన పరీక్షల విషయంలో అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా మున్సిఫ్ కోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు డాక్టర్ల బోర్డు ఒకసారి ఎంపికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీలో ఉన్నపుడు పోయిన శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దారుణంగా కొట్టారంటు ఎంపి చేసిన ఆరోపణల నేపధ్యంలో వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం వచ్చింది.
అయితే మున్సిఫ్ కోర్టు మెడికల్ బోర్డుతో పాటు క్రాస్ చెకింగ్ కోసం రమేష్ ఆసుపత్రి వైద్యులతో కూడా పరీక్షలు నిర్వహించాలని ఎంపి తరపు లాయర్ పట్టుబట్టారు. దీన్ని సీఐడీ తరపు లాయర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇదే పాయింట్ పై ఎంపి కొడుకు భరత్ కూడా సుప్రింకోర్టులో కేసు వేశారు. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో పరీక్షలు, వైద్యం చేయింలని కోరారు. ఈ విషయమై సుప్రింకోర్టులో విచారణ జరిగినపుడు మధ్యేమార్గంగా సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు, వైద్యం అందించాలని కోర్టు డిసైడ్ చేసింది.
సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం పరీక్షలు నిర్వహించారు. గుంటూరులో పరీక్షించిన మెడికల్ బోర్డు ఎంపిని ఎవరు కొట్టలేదని నిర్ధారించింది. ఎంపి పాదల రంగుమారటానికి కారణం ఎడీమా అనే సమస్యగా నిర్ధారించింది. మరి తాజాగా ఆర్మీ వైద్యులు చేసిన పరీక్షల్లో ఏమి తేలిందనే విషయంలో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.
మంగళవారం సాయంత్రానికి ఆర్మీ డాక్టర్లు తమ రిజల్టును హైకోర్టు రిజిస్ట్రార్ కు అందించారు. వైద్య పరీక్షల రిజల్టుతో పాటు మొత్తం ప్రక్రియను చిత్రీకరిచింన వీడియోను కూడా అందించారు. వీడియో కవరేజీ ఫుటేజీతో పాటు వైద్య పరీక్షల రిజల్టును కూడా రిజిస్ట్రార్ సీల్డ్ కవర్లో సుప్రింకోర్టుకు పంపేశారు. వైద్యుల ఫైండిగ్స్ ఏమిటనే విషయాన్ని సుప్రింకోర్టు శుక్రవారం విచారణలో ఓపెన్ చేస్తుంది. అప్పటివరకు పార్టీనేతల్లో బాగా టెన్షన్ పెరిగిపోతోంది.
ఆర్మీ వైద్యుల పరీక్షల్లో కూడా మెడికల్ బోర్డు రిజల్టే రిపీటైతే రాజకీయం ఒకరకంగా ఉంటుంది. అలాకాకుండా మెడికల్ బోర్డు రిజల్టుతో విభేదిస్తే మరో రకంగా ఉంటుంది. ఏదేమైనా ఆర్మీ డాక్టర్ల ఫైండిగ్స్ పైనే రఘురామ భవిష్యత్తు రాజకీయం ఆధారపడుందనే విషయంలో మాత్రం సందేహంలేదు.
This post was last modified on May 19, 2021 11:54 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…