Political News

పార్టీల్లో పెరిగిపోతున్న టెన్షన్

నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చేసిన పరీక్షల విషయంలో అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా మున్సిఫ్ కోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు డాక్టర్ల బోర్డు ఒకసారి ఎంపికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీలో ఉన్నపుడు పోయిన శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దారుణంగా కొట్టారంటు ఎంపి చేసిన ఆరోపణల నేపధ్యంలో వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం వచ్చింది.

అయితే మున్సిఫ్ కోర్టు మెడికల్ బోర్డుతో పాటు క్రాస్ చెకింగ్ కోసం రమేష్ ఆసుపత్రి వైద్యులతో కూడా పరీక్షలు నిర్వహించాలని ఎంపి తరపు లాయర్ పట్టుబట్టారు. దీన్ని సీఐడీ తరపు లాయర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇదే పాయింట్ పై ఎంపి కొడుకు భరత్ కూడా సుప్రింకోర్టులో కేసు వేశారు. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో పరీక్షలు, వైద్యం చేయింలని కోరారు. ఈ విషయమై సుప్రింకోర్టులో విచారణ జరిగినపుడు మధ్యేమార్గంగా సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు, వైద్యం అందించాలని కోర్టు డిసైడ్ చేసింది.

సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం పరీక్షలు నిర్వహించారు. గుంటూరులో పరీక్షించిన మెడికల్ బోర్డు ఎంపిని ఎవరు కొట్టలేదని నిర్ధారించింది. ఎంపి పాదల రంగుమారటానికి కారణం ఎడీమా అనే సమస్యగా నిర్ధారించింది. మరి తాజాగా ఆర్మీ వైద్యులు చేసిన పరీక్షల్లో ఏమి తేలిందనే విషయంలో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

మంగళవారం సాయంత్రానికి ఆర్మీ డాక్టర్లు తమ రిజల్టును హైకోర్టు రిజిస్ట్రార్ కు అందించారు. వైద్య పరీక్షల రిజల్టుతో పాటు మొత్తం ప్రక్రియను చిత్రీకరిచింన వీడియోను కూడా అందించారు. వీడియో కవరేజీ ఫుటేజీతో పాటు వైద్య పరీక్షల రిజల్టును కూడా రిజిస్ట్రార్ సీల్డ్ కవర్లో సుప్రింకోర్టుకు పంపేశారు. వైద్యుల ఫైండిగ్స్ ఏమిటనే విషయాన్ని సుప్రింకోర్టు శుక్రవారం విచారణలో ఓపెన్ చేస్తుంది. అప్పటివరకు పార్టీనేతల్లో బాగా టెన్షన్ పెరిగిపోతోంది.

ఆర్మీ వైద్యుల పరీక్షల్లో కూడా మెడికల్ బోర్డు రిజల్టే రిపీటైతే రాజకీయం ఒకరకంగా ఉంటుంది. అలాకాకుండా మెడికల్ బోర్డు రిజల్టుతో విభేదిస్తే మరో రకంగా ఉంటుంది. ఏదేమైనా ఆర్మీ డాక్టర్ల ఫైండిగ్స్ పైనే రఘురామ భవిష్యత్తు రాజకీయం ఆధారపడుందనే విషయంలో మాత్రం సందేహంలేదు.

This post was last modified on May 19, 2021 11:54 am

Share
Show comments

Recent Posts

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

15 minutes ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

5 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

6 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

11 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

11 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

12 hours ago