సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే.. దాడిశెట్టి రాజా. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు గట్టి పట్టుంది. అయితే.. దాడిశెట్టి ఎంట్రీతో ఇక్కడి పాలిటిక్స్ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై రాజా వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన డిమాండ్ పరిష్కరిస్తామని.. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
తుని ప్రజలు ప్రధానంగా రెండు డిమాండ్లు తెరమీదకి తెచ్చారు. స్థానికంగా తమకు ఇబ్బందిగా మారిన దివీస్ ల్యాబ్ లేటరీని ఏర్పాటు చేయొద్దని.. కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో దివీస్కు వ్యతిరేకంగా దాడిశెట్టి.. ప్రజలతో కలిసి పోరాటం చేశారు. దివీస్కు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దని కూడా నాడు గట్టిగా పట్టుబట్టారు. దీంతో ప్రజలు ఆయనకు మద్దతుగా.. గత ఎన్నికల్లోనూ వరుసగా గెలిపించారు. ఇక, జగన్ కూడా.. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో.. రాజా లేవనెత్తిన డిమాండ్కు సై.. అన్నారు.
ఎట్టిపరిస్థితిలోనూ దివీస్కు అనుమతి ఇచ్చేది లేదన్నారు. దీంతో ప్రజలు కూడా విశ్వసించారు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక.. దివీస్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. పైగా శంకుస్థాపనకు ఆయనే స్వయంగా హాజరయ్యారు. దీంతో దాడిశెట్టికి తీవ్ర ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా.. జనసేన నాయకులు కూడా టార్గెట్ చేస్తున్నారు.
మరోవైపు.. నియోజకవ ర్గంలో మత్స్య కారులకు అవసరమైన అభివృద్ధి పనులు చేయిస్తానన్నప్పటికీ.. దాడిశెట్టి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి నిధులు కూడా అందడంలేదని.. స్థానిక నేతలు వాపోతున్నారు. ఇలా.. జగన్ తీసుకున్న నిర్ణయం తుని ఎమ్మెల్యే ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరికి గురవుతుండడం గమనార్హం.
This post was last modified on May 17, 2021 2:10 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…