సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే.. దాడిశెట్టి రాజా. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు గట్టి పట్టుంది. అయితే.. దాడిశెట్టి ఎంట్రీతో ఇక్కడి పాలిటిక్స్ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్పై రాజా వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన డిమాండ్ పరిష్కరిస్తామని.. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
తుని ప్రజలు ప్రధానంగా రెండు డిమాండ్లు తెరమీదకి తెచ్చారు. స్థానికంగా తమకు ఇబ్బందిగా మారిన దివీస్ ల్యాబ్ లేటరీని ఏర్పాటు చేయొద్దని.. కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో దివీస్కు వ్యతిరేకంగా దాడిశెట్టి.. ప్రజలతో కలిసి పోరాటం చేశారు. దివీస్కు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దని కూడా నాడు గట్టిగా పట్టుబట్టారు. దీంతో ప్రజలు ఆయనకు మద్దతుగా.. గత ఎన్నికల్లోనూ వరుసగా గెలిపించారు. ఇక, జగన్ కూడా.. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో.. రాజా లేవనెత్తిన డిమాండ్కు సై.. అన్నారు.
ఎట్టిపరిస్థితిలోనూ దివీస్కు అనుమతి ఇచ్చేది లేదన్నారు. దీంతో ప్రజలు కూడా విశ్వసించారు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక.. దివీస్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. పైగా శంకుస్థాపనకు ఆయనే స్వయంగా హాజరయ్యారు. దీంతో దాడిశెట్టికి తీవ్ర ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా.. జనసేన నాయకులు కూడా టార్గెట్ చేస్తున్నారు.
మరోవైపు.. నియోజకవ ర్గంలో మత్స్య కారులకు అవసరమైన అభివృద్ధి పనులు చేయిస్తానన్నప్పటికీ.. దాడిశెట్టి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి నిధులు కూడా అందడంలేదని.. స్థానిక నేతలు వాపోతున్నారు. ఇలా.. జగన్ తీసుకున్న నిర్ణయం తుని ఎమ్మెల్యే ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరికి గురవుతుండడం గమనార్హం.
This post was last modified on May 17, 2021 2:10 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…