Political News

బ‌ద్వేల్ లో.. టీడీపీ ప‌వ‌ర్ ఎంత ?

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్‌. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా వైసీపీ విజ‌యం సాధిస్తోంది. 2014లో తిరువీధి జ‌య‌రాములు, 2019లో డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య‌లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009లోనూ ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి క‌మ‌ల‌మ్మ గెలిచారు. అయితే.. ఇటీవ‌ల ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంక‌ట‌ సుబ్బ‌య్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్ర‌మంలో మ‌రో నాలుగు మాసాల్లో ఇక్క‌డ ఉప ఎన్నిక రానుంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి రాజ‌కీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎవ‌రికి టికెట్ ఇస్తుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ ప్ర‌తి ఎన్నిక‌లోనూ.. పార్టీలు అభ్య‌ర్థుల‌ను మారుస్తున్నాయి.

ప్ర‌స్తుతం అధికార పార్టీ హ‌వా .. జిల్లా వ్యాప్తంగా ఉంది. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డంతో ఇక్క‌డ అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అంతేకాదు.. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా దూకుడుగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. అదే స‌మ‌యంలో ఎంపీలు అవినాష్‌, మిధున్ రెడ్డిలు.. కూడా యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో జిల్లాలో దాదాపు టీడీపీ మాట‌, జెండా కూడా క‌నిపించ‌డం లేదు. వినిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మాజీ మంత్రులు ఆదినారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి లాంటి వాళ్లు కూడా పార్టీ మారిపోయారు. స‌తీష్‌రెడ్డిది అదే బాట‌.

ఇంకా చెప్పాలంటే జిల్లా టీడీపీలో కీల‌క నేత‌లు కాడి కింద‌ప‌డేయ‌డ‌మో లేదా మౌనంగా ఉండ‌డ‌మో చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఉప ఎన్నిక‌లో టీడీపీ ఎలాంటి వ్యూహం అనుస‌రించ‌బోతోంది? అనేది ఆస‌క్తిగా మారింది. వైసీపీ త‌ర‌ఫున ఎవ‌రిని నిల‌బెట్టినా.. గెలిపించుకునేందుకు అనేక మంది నాయ‌కులు ఉన్నారు. కానీ, టీడీపీ త‌ర‌ఫున నాయ‌కులు నిల‌బ‌డే వారు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. పైగా.. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఒక‌రినే ఇక్క‌డ నిల‌బెట్టిన ప‌రిస్థితి లేదు. పైగా.. స్థిర‌మైన నేత చేతిలో పార్టీ ప‌గ్గాలు పెట్ట‌లేదు. దీంతో ఎవ‌రికి టికెట్ కేటాయించిన‌ప్ప‌టికీ.. నిల‌బ‌డేందుకు స‌ద‌రు నేత‌ను గెలిపించుకునేందుకు మ‌ళ్లీ చంద్ర‌బాబు రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త రెండు ఎన్నిక‌ల్లో 2014లో విజ‌య జ్యోతి పోటీ చేసి.. 68800 ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, గ‌త 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌.. 50 వేల పైచిలుకు ఓట్ల‌కు ప‌రిమిత‌య్యారు. సో.. ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ ఓట్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప పోరులో టీడీపీకి మ‌రింత‌గా ఓటు బ్యాంకు త‌గ్గుతుందా? లేక‌.. పెరుగుతుందా ? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. టీడీపీకి ఎలాగూ గెలిచే స్కోప్ లేక‌పోయినా ఓట్లు పెరిగితేనే పెద్ద సంచ‌ల‌నం. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోరు చేస్తున్నా.. సీఎం సొంత జిల్లాలో మాత్రం ఆత ర‌హా వేడి క‌నిపించ‌ని నేప‌థ్యంలో టీడీపీ ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తుందోన‌నే ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చింది.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

27 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

36 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago