Political News

జగన్ ఆరోపణలపై భారత్ బయోటెక్ స్పందన


ఓవైపు కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ప్రాణాలు నిలిపే సంజీవనిగా భావిస్తున్న వ్యాక్సిన్ డిమాండుకు తగ్గట్లు సరఫరా లేక దేశవ్యాప్తంగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సిన్ నిల్వలు మరీ తక్కువగా ఉన్నాయి. కొత్త వాళ్లకు తొలి డోస్ వేయడం సంగతలా ఉంచితే.. ఇప్పటికే ఫస్ట్ డోస్ వేసుకుని, సెకండ్ డోస్ వేసుకోవాల్సిన గడువు రావడంతో టీకా కేంద్రాలకు వెళ్తుంటే నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి.

ఐతే ఈ విషయంలో తమ వైఫల్యం ఏమీ లేదంటూ జగన్ సర్కారు చేతులెత్తేస్తోంది. నెపాన్ని కేంద్రంతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి మీద, ఈనాడు అధినేత రామోజీ రావు మీద నెట్టేస్తున్నారు వైకాపా నేతలు. భారత్ బయోటెక్ నుంచి కోవాగ్జిన్ నిల్వలు ఏపీకి రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న అర్థం వచ్చేలా స్వయంగా సీఎం జగనే ప్రెస్ మీట్లో ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.

ఐతే ఈ సంక్షోభ సమయంలో పూర్తిగా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం మీదే దృష్టిపెట్టి ఈ ఆరోపణలపై సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ బయోటెక్ అధినేతలు.. ఇప్పుడు మౌనం వీడుతున్నారు. తమ గురించి దుష్ప్రచారం చేస్తుండటంతో సంస్థ అధినేతల్లో ఒకరైన సుచిత్ర ఎల్లా స్పందించారు. నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా సీఎం జగన్ పేరు ఎత్తకుండా.. పరోక్షంగానే తమకు దురుద్దేశాలు ఆపాదించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 10న ప్రయారిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా 18 రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసులను పంపామని.. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులను బట్టి చిన్న చిన్న షిప్‌మెంట్లే పంపించామని.. ఐతే కొన్ని రాష్ట్రాలు తమకు దురుద్దేశాలు ఆపాదించడం చాలా బాధిస్తోందని ఆమె తెలిపారు.

తమ సిబ్బందిలో కూడా 50 మంది దాకా కరోనా బారిన పడ్డారని.. ఇలాంటి పరిస్థితుల్లో తమ సంస్థ 24 x 7 కష్టపడుతూ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తోందని ఆమె ట్విట్టర్లో వివరించారు. మరోవైపు సంస్థ మరో అధినేత కృష్ణా ఎల్లా వ్యాక్సిన్ డోసులకు సంబంధించి తమకు లేఖ రాసిన ఢిల్లీ ప్రభుత్వానికి జవాబు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపుతున్నామని, అంతకుమించి తాము చేసేదేమీ లేదని అందులో ఆయన స్పష్టం చేశారు.

This post was last modified on May 12, 2021 6:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

1 hour ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

3 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

4 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

4 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

6 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

6 hours ago