పోయినేడాది లాక్ డౌన్ టైంలో అన్ని దుకాణాల్లాగే వైన్ షాపులూ మూతపడిపోవడంతో మందుబాబులు ఎంత ఇబ్బంది పడిపోయారో తెలిసిందే. దాదాపు రెండు నెలలు మద్యం దొరక్క అల్లాడిపోయారు. చివరికి మద్యం దుకాణాలు తెరుచుకోగానే వాటి మీదికి ఎలా దండెత్తారో చూశాం. ఐతే కొన్నాళ్లకు మామూలు పరిస్థితులు వచ్చాయి. ఇక అప్పట్నుంచి సాధారణంగానే నడుస్తున్నాయి మద్యం దుకాణాలు. కట్ చేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మెజారిటీ రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టడంతో తెలంగాణ కూడా ఆ దిశగా అడుగులు వేయక తప్పలేదు.
ఐతే బుధవారం నుంచి లాక్ డౌన్ అని వార్త బయటికి రావడం ఆలస్యం.. మందు బాబులు ఒక్కసారిగా మద్యం దుకాణాలపై పడిపోయారు. వచ్చే పది రోజుల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మిగతా దుకాణాల్లాగే వైన్ షాపులు కూడా నడుస్తాయని అంటున్నా సరే.. ఇంకెప్పుడూ మద్యం దొరకదేమో అన్నట్లు వైన్ షాపులను ఊడ్చేశారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి వైన్ షాపుల దగ్గర ఎలా క్యూలైన్లు ఉన్నాయో.. ఒక్కొక్కరు బ్యాగుల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు పెట్టుకుని ఎలా బయటికొస్తూ కనిపించారో మీడియాలో అందరూ చూశారు. మందు బాబుల పైత్యం ఏ స్థాయికి చేరిందనడానికి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో లగ్జరీ బ్రాండ్లకు నెలవైన ‘టానిక్’ అనే భారీ మద్యం దుకాణానికి సంబంధించిన దృశ్యాలే నిదర్శనం. చాలా విశాలమైన ఆ వైన్ షాపులో ఉన్న మద్యం మొత్తం మూడే మూడు గంటల్లో ఖాళీ అయిపోయింది. బాటిళ్లతో నిండుగా ఉన్న ర్యాక్స్ అన్నీ లాక్ డౌన్ ప్రకటన వచ్చాక కొన్ని గంటల్లో ఖాళీ అయిపోయాయి.
ఇక్కడ ఆ మూడు గంటల్లో జరిగిన వ్యాపారం సంగతి తెలిస్తే షాకవ్వక మానరు. ఏకంగా మూడున్నర కోట్ల విలువైన మద్యం ఆ మూడు గంటల్లో అమ్ముడైపోయిందట. తెలుగు రాష్ట్రాల్లో ఒక మద్యం దుకాణానికి సంబంధించి ఇది రికార్డు అయి ఉంటుందనడంలో సందేహం లేదు. ఒక్క దుకాణంలో ఇంత ఆదాయం అంటే.. మొత్తం తెలంగాణలోని వైన్ షాపులన్నీ కలుపుకుంటే లెక్క ఎంత ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే.
This post was last modified on May 12, 2021 9:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…