తెలంగాణలో లాక్ డౌన్ అంటూ మంగళవారం మధ్యాహ్నం సమాచారం బయటికి రావడం ఆలస్యం.. జనాలు ప్యానిక్ బయింగ్కు రెడీ అయిపోయారు. సూపర్ మార్కెట్లు.. కూరగాయల మార్కెట్లు.. ఇతర దుకాణాలు.. హోటళ్లు.. వైన్ షాపుల ముందు విపరీతమైన రద్దీ కనిపించింది. ముఖ్యంగా జీవితంలో ఇంకెప్పుడూ మద్యం దొరకదేమో అన్నట్లు వైన్ షాపుల మీద పడిపోయారు మందుబాబులు.
పది రోజుల లాక్ డౌన్లో రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జనాలకు అవసరమైన దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని, ఏం కావాలన్నా కొనుక్కోవచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినా జనాలు ఆగలేదు. ఐతే ఇప్పుడు లాక్డౌన్కు సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయి. రాబోయే పది రోజుల్లో పూర్తిగా వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు సంబందించి మూతపడేవి ఏవి.. ఉదయం 6-10 మధ్య తెరుచుకునేవి ఏవి అనేది ఇందులో వివరించారు.
రాబోయే పది రోజుల్లో ఉదయం 6-10 గంటల మధ్య కూరగాయల మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, మిగతా ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందించే దుకాణాలన్నీ తెరుచుకుంటాయి. మంగళవారం సాయంత్రం మద్యం దుకాణాలపై దండెత్తిన మందు బాబులు కూడా భయపడాల్సిన పని లేదు. ఉదయం 6-10 మధ్య వైన్ షాపులు కూడా తెరుచుకుంటాయి. ఈ సమయంలో ప్రజా రవాణా కూడా ఉంటుంది. బస్సులు, మెట్రో రైళ్లు కూడా నడుస్తాయి.
సామాన్య ప్రజానీకం ఉదయం 10 తర్వాత బయట తిరగడానికి వీల్లేదు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా 24 గంటలూ బయట తిరడానికి అనుమతి ఉంది. కాగా ఈ పది రోజుల లాక్ డౌన్లో మాల్స్, సినిమా థియేటర్లు, పబ్బులు, పార్కులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం పూర్తిగా మూతబడి ఉంటాయి. రెస్టారెంట్లు, హోటళ్ల గురించి మార్గదర్శకాల్లో ఏమీ పేర్కొనలేదు. బహుశా వాటిలో డైనింగ్కు అవకాశం లేకుండా ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా హోం డెలివరీ మాత్రమే కల్పించే అవకాశాలున్నాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…