తెలంగాణలో లాక్ డౌన్ అంటూ మంగళవారం మధ్యాహ్నం సమాచారం బయటికి రావడం ఆలస్యం.. జనాలు ప్యానిక్ బయింగ్కు రెడీ అయిపోయారు. సూపర్ మార్కెట్లు.. కూరగాయల మార్కెట్లు.. ఇతర దుకాణాలు.. హోటళ్లు.. వైన్ షాపుల ముందు విపరీతమైన రద్దీ కనిపించింది. ముఖ్యంగా జీవితంలో ఇంకెప్పుడూ మద్యం దొరకదేమో అన్నట్లు వైన్ షాపుల మీద పడిపోయారు మందుబాబులు.
పది రోజుల లాక్ డౌన్లో రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జనాలకు అవసరమైన దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని, ఏం కావాలన్నా కొనుక్కోవచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినా జనాలు ఆగలేదు. ఐతే ఇప్పుడు లాక్డౌన్కు సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయి. రాబోయే పది రోజుల్లో పూర్తిగా వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు సంబందించి మూతపడేవి ఏవి.. ఉదయం 6-10 మధ్య తెరుచుకునేవి ఏవి అనేది ఇందులో వివరించారు.
రాబోయే పది రోజుల్లో ఉదయం 6-10 గంటల మధ్య కూరగాయల మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, మిగతా ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందించే దుకాణాలన్నీ తెరుచుకుంటాయి. మంగళవారం సాయంత్రం మద్యం దుకాణాలపై దండెత్తిన మందు బాబులు కూడా భయపడాల్సిన పని లేదు. ఉదయం 6-10 మధ్య వైన్ షాపులు కూడా తెరుచుకుంటాయి. ఈ సమయంలో ప్రజా రవాణా కూడా ఉంటుంది. బస్సులు, మెట్రో రైళ్లు కూడా నడుస్తాయి.
సామాన్య ప్రజానీకం ఉదయం 10 తర్వాత బయట తిరగడానికి వీల్లేదు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా 24 గంటలూ బయట తిరడానికి అనుమతి ఉంది. కాగా ఈ పది రోజుల లాక్ డౌన్లో మాల్స్, సినిమా థియేటర్లు, పబ్బులు, పార్కులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం పూర్తిగా మూతబడి ఉంటాయి. రెస్టారెంట్లు, హోటళ్ల గురించి మార్గదర్శకాల్లో ఏమీ పేర్కొనలేదు. బహుశా వాటిలో డైనింగ్కు అవకాశం లేకుండా ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా హోం డెలివరీ మాత్రమే కల్పించే అవకాశాలున్నాయి.
This post was last modified on May 12, 2021 8:57 am
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…