పాలనలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని.. కరోనా విషయంలో సరైన విధంగా స్పందించలేదని పేర్కొంటూ.. తక్షణమే సీఎం పదవికి రిజైన్ చేయాలని.. కోరుతూ.. పెద్ద ఎత్తు ట్వీట్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా యి. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన సహా… రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్.. కొరత సహా వ్యాక్సిన్ ఇవ్వలేక పోతున్న నేపథ్యంలో ఇదేనా ఒక్క ఛాన్స్ అంటూ.. నిలదీస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
ట్విటర్లో #ResignJagan హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు 20.5 వేల ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు లో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వారంలో ఇటువంటి సంఘటనలు అనంతపురం, కర్నూలు సహా మరికొన్ని చోట్ల కూడా జరిగాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదని.. చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.
కొసమెరుపు!
కొన్నాళ్ల కిందట.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపైనా ఇలానే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జనాలు.. రాజీనామా చేయాలంటూ.. డిమాండ్ చేయడం గమనార్హం. ఇప్పుడు అంతే సెగ ఇప్పుడు కేవలం ఏపీ సీఎం జగన్కే ఎదురు కావడం గమనార్హం. మరి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 11, 2021 7:12 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…