పాలనలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని.. కరోనా విషయంలో సరైన విధంగా స్పందించలేదని పేర్కొంటూ.. తక్షణమే సీఎం పదవికి రిజైన్ చేయాలని.. కోరుతూ.. పెద్ద ఎత్తు ట్వీట్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా యి. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన సహా… రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్.. కొరత సహా వ్యాక్సిన్ ఇవ్వలేక పోతున్న నేపథ్యంలో ఇదేనా ఒక్క ఛాన్స్ అంటూ.. నిలదీస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
ట్విటర్లో #ResignJagan హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు 20.5 వేల ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం రుయా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు లో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వారంలో ఇటువంటి సంఘటనలు అనంతపురం, కర్నూలు సహా మరికొన్ని చోట్ల కూడా జరిగాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ నాయకత్వ లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం వచ్చినప్పటి నుంచి కనీసం ఒకసారైనా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదని.. చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నారు.
కొసమెరుపు!
కొన్నాళ్ల కిందట.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపైనా ఇలానే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జనాలు.. రాజీనామా చేయాలంటూ.. డిమాండ్ చేయడం గమనార్హం. ఇప్పుడు అంతే సెగ ఇప్పుడు కేవలం ఏపీ సీఎం జగన్కే ఎదురు కావడం గమనార్హం. మరి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…