Political News

తెలంగాణా పోలీసులు మరీ ఇంత దారుణమా ?

కరోనా వైరస్ రోగుల విషయంలో తెలంగాణా పోలీసులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కరోనా చికిత్స కోసం ఏపిలోని అనేక ప్రాంతాల నుండి హైదరాబాద్ కు అంబులెన్సుల్లో వస్తున్నవారిని సోమవారం ఉదయం నుండి రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర నిలిపేస్తున్నారు. అంబులెన్సుల్లో వెంటిలేటర్లపై ఉన్న రోగులను కూడా తెలంగాణాలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో సదరు రోగిని చేర్చుకుంటున్నట్లు ధృవపత్రాన్ని చూపించిన రోగులను మాత్రమే పోలీసులు అనుమతించటం వివాదాస్పదమైంది. రోజువారి అత్యవసర వైద్యం కోసం ఏపితో పాటు కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ నుండి వందల సంఖ్యలో రోగులు హైదరాబాద్ కు వస్తుంటారు. ఇదే పద్దతిలో పై ప్రాంతాల నుండి కరోనా రోగులు ఏపిలోని అనేక జిల్లాల నుండి హైదరాబాద్ బయలుదేరారు.

అయితే సరిహద్దుల దగ్గర రోగులున్న అంబులెన్సులను పోలీసులు నిలిపేయటంతో సమస్య పెరిగిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపి నుండి ఏ అవసరాల కోసం వస్తున్న వాళ్ళనైనా పోలీసులు అడ్డుకునేందుకు లేదు. ఎందుకంటే పదేళ్ళు తెలంగాణా+ఏపికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానికి రానీయకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదు.

ఇప్పటివరకు కరోనా సమస్య విషయంలో ఏపి వెల్లడిస్తున్న లెక్కలతో పోల్చుకుంటే తెలంగాణా ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలతో చాలామందికి అనుమానాలున్నాయి. వాస్తవ లెక్కలకన్నా చాలా తక్కువ కేసులను ప్రభుత్వం చూపిస్తోందనే ఆరోపణలను తెలంగాణా ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఏపి నుండి రోగులను హైదరాబాద్ కు అనుమతిస్తే తమకు మరింత సమస్య పెరిగిపోతుందని తెలంగాణ ప్రభుత్వం భావించినట్లుంది.

ఇదే సమయంలో తెలంగాణాలో కూడా సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా ఇక్కడి రోగులకు వైద్యసదుపాయాలు అందించటం కష్టమని కూడా అనుకున్నట్లుంది. ఎందుకంటే తెలంగాణాలో కూడా టీకాలు, ఆక్సిజన్ కు కొరత పెరిగిపోతోంది. అందుకనే ఏపి నుండి వచ్చే రోగులను అడ్డుకుంటున్నది.

This post was last modified on May 11, 2021 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago