కరోనా వైరస్ రోగుల విషయంలో తెలంగాణా పోలీసులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కరోనా చికిత్స కోసం ఏపిలోని అనేక ప్రాంతాల నుండి హైదరాబాద్ కు అంబులెన్సుల్లో వస్తున్నవారిని సోమవారం ఉదయం నుండి రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర నిలిపేస్తున్నారు. అంబులెన్సుల్లో వెంటిలేటర్లపై ఉన్న రోగులను కూడా తెలంగాణాలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో సదరు రోగిని చేర్చుకుంటున్నట్లు ధృవపత్రాన్ని చూపించిన రోగులను మాత్రమే పోలీసులు అనుమతించటం వివాదాస్పదమైంది. రోజువారి అత్యవసర వైద్యం కోసం ఏపితో పాటు కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ నుండి వందల సంఖ్యలో రోగులు హైదరాబాద్ కు వస్తుంటారు. ఇదే పద్దతిలో పై ప్రాంతాల నుండి కరోనా రోగులు ఏపిలోని అనేక జిల్లాల నుండి హైదరాబాద్ బయలుదేరారు.
అయితే సరిహద్దుల దగ్గర రోగులున్న అంబులెన్సులను పోలీసులు నిలిపేయటంతో సమస్య పెరిగిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపి నుండి ఏ అవసరాల కోసం వస్తున్న వాళ్ళనైనా పోలీసులు అడ్డుకునేందుకు లేదు. ఎందుకంటే పదేళ్ళు తెలంగాణా+ఏపికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానికి రానీయకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదు.
ఇప్పటివరకు కరోనా సమస్య విషయంలో ఏపి వెల్లడిస్తున్న లెక్కలతో పోల్చుకుంటే తెలంగాణా ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలతో చాలామందికి అనుమానాలున్నాయి. వాస్తవ లెక్కలకన్నా చాలా తక్కువ కేసులను ప్రభుత్వం చూపిస్తోందనే ఆరోపణలను తెలంగాణా ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఏపి నుండి రోగులను హైదరాబాద్ కు అనుమతిస్తే తమకు మరింత సమస్య పెరిగిపోతుందని తెలంగాణ ప్రభుత్వం భావించినట్లుంది.
ఇదే సమయంలో తెలంగాణాలో కూడా సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా ఇక్కడి రోగులకు వైద్యసదుపాయాలు అందించటం కష్టమని కూడా అనుకున్నట్లుంది. ఎందుకంటే తెలంగాణాలో కూడా టీకాలు, ఆక్సిజన్ కు కొరత పెరిగిపోతోంది. అందుకనే ఏపి నుండి వచ్చే రోగులను అడ్డుకుంటున్నది.
This post was last modified on May 11, 2021 10:40 am
మాజీ ఎంపీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 50వ వివాహ వార్షికోత్సవం…
నియోజకవర్గాలకు నాయకులను ఎంపిక చేస్తున్న జగన్పై అదే నాయకుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఒత్తిడితోనే జగన్ ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నాడో కానీ.. అది ఆయనకు కెరీర్లో ఎన్నడూ…
సౌత్ సినిమాను దశాబ్దాలుగా తక్కువగా చూస్తుండేది బాలీవుడ్. అక్కడి నటులు, ఫిలిం మేకర్లు తమను తాము గొప్పగా ఫీలయ్యేవాళ్లన్నది స్పష్టం.…
హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో…
కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్న టైమిది. అలాంటిది రీ రిలీజులకు జనాన్ని ఆశించడం కష్టమే. మొన్నటికి…