ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహారం చూస్తే… పార్టీ అభిమానులు నివ్వెరపోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం మంచిదే అయినా.. క్షేత్ర స్థాయిలో బలంపై అంచనావేసుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రతిపక్షం పాత్ర పోషించినప్పటికీ.. మరోవైపు.. నియోజకవర్గాలపై దృష్టి పెడుతూనే ముందుకు సాగింది. ఏ నియోజకవర్గం లో ఏం జరుగుతోంది? ఏ నేత ఎలా వ్యవహరిస్తున్నారనే విషయంపై నిరంతరం మానిటరింగ్ చేసుకున్న పరిస్థితి వచ్చింది.
అంతేకాదు.. ఎన్నికల సమయానికి అప్పటికప్పుడు కాకుండా.. ఏకంగా ఏడాదిన్నర ముందునుంచే ఎవరిని ఉంచాలి ? ఎవరిని తుంచాలనే విషయంపై పక్కాగా అధ్యయనం చేసింది. ఈ తరహా.. వ్యూహం టీడీపీలో కొరవడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గాన్ని చూస్తే.. ఇది ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గౌతు ఫ్యామిలీ ఇక్కడ నుంచి పదిసార్లు గెలిచింది. అంటే ఐదారు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీకి ప్రజలు ఎంతలా పట్టం కట్టారో తెలుస్తోంది.
గత టర్మ్లో ఇక్కడ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో జిల్లా పార్టీ ఇంచార్జ్గా శివాజీ కుమార్తె గౌతు శిరీష వ్యవహరించారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె ఓడిపోయారు. అయితే.. దీనికి సొంత కేడర్ సహకరించకపోవడం వల్లే.. తాను ఓడిపోయానని.. కొన్నాళ్లుగా ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. పోనీ.. పార్టీలో ఉన్న కీలక నేతలైనా.. ఆమెను ఓదార్చి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. దీంతో ఇక్కడ నుంచి గెలిచి.. మంత్రి పదవి చేపట్టిన.. సీదిరి అప్పలరాజు.. తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ టీడీపీ కేడర్ను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పైగా అప్పలరాజు మంత్రిగా ఉండడంతో టీడీపీ నేతలు చాలా మంది .. ఆయనకు అనుకూలంగా మారి.. లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. పనులు కూడా చేయించుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక శిరీష ఫ్యామిలీతో పాటు స్థానికంగా కంటే వైజాగ్లో ఉండేందుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ కేడర్లో ధైర్యం సన్నగిల్లుతోన్న పరిస్థితి. మరి పలాస టీడీపీని ఎప్పటకి ఎవరు గాడిలో పెడతారో ? చూడాలి.
This post was last modified on May 13, 2021 8:21 am
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…