ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహారం చూస్తే… పార్టీ అభిమానులు నివ్వెరపోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం మంచిదే అయినా.. క్షేత్ర స్థాయిలో బలంపై అంచనావేసుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రతిపక్షం పాత్ర పోషించినప్పటికీ.. మరోవైపు.. నియోజకవర్గాలపై దృష్టి పెడుతూనే ముందుకు సాగింది. ఏ నియోజకవర్గం లో ఏం జరుగుతోంది? ఏ నేత ఎలా వ్యవహరిస్తున్నారనే విషయంపై నిరంతరం మానిటరింగ్ చేసుకున్న పరిస్థితి వచ్చింది.
అంతేకాదు.. ఎన్నికల సమయానికి అప్పటికప్పుడు కాకుండా.. ఏకంగా ఏడాదిన్నర ముందునుంచే ఎవరిని ఉంచాలి ? ఎవరిని తుంచాలనే విషయంపై పక్కాగా అధ్యయనం చేసింది. ఈ తరహా.. వ్యూహం టీడీపీలో కొరవడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గాన్ని చూస్తే.. ఇది ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గౌతు ఫ్యామిలీ ఇక్కడ నుంచి పదిసార్లు గెలిచింది. అంటే ఐదారు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీకి ప్రజలు ఎంతలా పట్టం కట్టారో తెలుస్తోంది.
గత టర్మ్లో ఇక్కడ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో జిల్లా పార్టీ ఇంచార్జ్గా శివాజీ కుమార్తె గౌతు శిరీష వ్యవహరించారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె ఓడిపోయారు. అయితే.. దీనికి సొంత కేడర్ సహకరించకపోవడం వల్లే.. తాను ఓడిపోయానని.. కొన్నాళ్లుగా ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. పోనీ.. పార్టీలో ఉన్న కీలక నేతలైనా.. ఆమెను ఓదార్చి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. దీంతో ఇక్కడ నుంచి గెలిచి.. మంత్రి పదవి చేపట్టిన.. సీదిరి అప్పలరాజు.. తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ టీడీపీ కేడర్ను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పైగా అప్పలరాజు మంత్రిగా ఉండడంతో టీడీపీ నేతలు చాలా మంది .. ఆయనకు అనుకూలంగా మారి.. లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. పనులు కూడా చేయించుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక శిరీష ఫ్యామిలీతో పాటు స్థానికంగా కంటే వైజాగ్లో ఉండేందుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ కేడర్లో ధైర్యం సన్నగిల్లుతోన్న పరిస్థితి. మరి పలాస టీడీపీని ఎప్పటకి ఎవరు గాడిలో పెడతారో ? చూడాలి.
This post was last modified on May 13, 2021 8:21 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…