“కరోనా విషయంలో దేశ ప్రజలను రక్షించేందుకు మేం అనేక అద్భుతాలు చేస్తున్నాం. మా మంత్రులు, యంత్రాంగం అందరూ కూడా బాగానేపనిచేస్తున్నారు. మీరు మాత్రం మాకు అడ్డు పడొద్దు!”-ఇదీ.. కేంద్రం లోని నరేంద్ర మోడీ సర్కారు దేశసర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు తాజాగా వెల్లడించిన అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడం.. ప్రపంచ మీడియా దుమ్మెత్తిపోయడం.. వ్యాక్సిన్ విధానం అంటూ.. ఒకటి లేకుండా ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరించడం.. వంటివి తెలిసిందే.
అంతేకాదు. వ్యాక్సిన్ తయారీ కంపెనీ.. కేంద్రానికి ఒక రేటుకు, రాష్ట్రాలకు మరో రేటుకు విక్రయించడం.. 18-45 ఏళ్ల వాళ్లకు మే 1 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. ప్రారంభం కాకపోవడం.. కరోనా రోగులకు సరైన వైద్యం అందించలేక పోవడం.. వైద్యులు, ఫ్రంట్లైన్ వర్కర్స్కు ప్రభుత్వ పరంగా అందుతున్న రక్షణ చర్యలు… ఇలా.. అనేకానేక అంశాలపై.. సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత విచారణ సమయంలో .. ప్రభుత్వం అనుసరిస్తున్న టీకా విధానాన్ని తప్పు పట్టింది.
జాతీయ టీకా విధానాన్ని ఎందుకు అమలు చేయలేయరేంటూ ప్రశ్నించింది. ఇక, రాష్ట్రాలకు ఒక ధరకు , కేంద్రానికి ఒక ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని.. అసలు అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై సమాధానంగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో తాము వ్యాక్సిన్ ప్రక్రియను చాలా పారదర్శకంగా తీసుకువెళ్తున్నామని.. ఈ విషయంలో సుప్రీం కోర్టు(విధాన పరమైన నిర్ణయాలు) జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందని తాజాగా పేర్కొంది. ప్రస్తుతం కోర్టు దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.
This post was last modified on May 11, 2021 7:33 am
``ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు.…
మే 1 వచ్చేస్తోంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్టే…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు…
సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. కొన్నేళ్లుగా ఆమె ఫిలిం కెరీర్ కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు.…
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం…