Political News

గంగా న‌దికీ క‌రోనా.. కొట్టుకొచ్చిన 50 క‌రోనా మృత‌దేహాలు

ప‌విత్ర గంగా న‌దికి కూడా క‌రోనా సోకిందా? హిందూ సామాజిక వ‌ర్గాలు.. అత్యంత ప‌విత్రంగా భావించే గంగాన‌ది నీరు కూడా ఇప్పుడు నిరుప‌యోగంగా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారిపోయిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మునిసిపాలిటీ అధికారులు. గంగా న‌ది ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉన్న యూపీలో ఇప్పుడు గంగా న‌దికి కూడా క‌రోనా ప్ర‌భావం సోకింద‌నే ప్ర‌చారం.. తీవ్ర క‌ల‌కలం రేపుతోంది. వార‌ణాసి స‌హా అనే ప్రాంతాల్లో ప్ర‌వ‌హించే గంగా న‌ది నీటిని.. యూపీలో జ‌నావాసాల‌కు కూడా స‌ర‌ఫ‌రా చేస్తారు.

ఈ నీటినే తాగేందుకు, సాగుకు కూడా వినియోగిస్తారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ గంగా న‌దికి కూడా క‌రోనా వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో జోరు ప్రచారం సాగుతుండ‌గా.. అధికారులు దీనిని ఇంకా నిర్ధారించ లేద‌ని.. అయితే.. ప్ర‌మాదం మాత్రం పొంచి ఉంద‌ని అంటున్నారు. దీనికి కార‌ణాల‌పై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు అందిన స‌మాచారం ప్ర‌కారం.. యూపీ, బిహార్‌లో ప్ర‌వ‌హించే గంగా న‌దికి ఒక ప్ర‌త్యేకత ఉంది. ఆరు ముక్తి ధామాల్లో గంగా న‌ది కూడా ఒక‌టి.

అయోధ్య‌, మ‌ధుర‌, మాయ‌, కాశీ, కాంచీ, అవంతిక‌ అని ఆరు ముక్తి ధామాల‌ను శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వీటిలో మ‌ర‌ణించ‌డం కానీ, మ‌ర‌ణించిన వారి మృత‌దేహాల‌కు ఈ ఆరు ప్ర‌దేశాల్లో ఎక్క‌డైనా అంతిమ సం స్కారం చేయ‌డం వ‌ల్ల కానీ.. ముక్తి ల‌భిస్తుంద‌ని హిందువుల ప్ర‌గాఢ విశ్వాసం. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల 15 రోజులుగా యూపీలో క‌రోనా కార‌ణంగా మృతి చెందిన వారి భౌతిక దేహాల‌ను గంగా న‌దిలో గుట్టు చ‌ప్పుడు కాకుండా క‌లిపేస్తున్నారు. ఎలాంటి హ‌డావుడి లేకుండానే సాగుతున్న ఈ క్ర‌తువుల‌పై అక్క‌డి యోగి ఆదిత్య నాథ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది.

అయితే.. తాజాగా ఇప్పుడు గంగా న‌ది ఒడ్డుకు.. 50 మృత దేహాలు కొట్టుకు వ‌చ్చాయి. బిహార్లోని బక్సర్ జిల్లాలో జ‌రిగిన ఈఘ‌ట‌న‌ తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాదేవ్ ఘాట్ సమీపంలో ఒక్క కిలోమీటరు పరిధిలోనే 48 శవాలు కనిపించాయి. చాలా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నాయి.

కరోనాతో చనిపోయినవారిని తమ బంధువులే ఇలా గంగా నదిలో పడేశారని స‌మాచారం అంద‌డంతో అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. గంగా న‌ది నీటి శాంపిళ్ల‌ను ప్ర‌యోగ‌శాల‌ల‌కు పంపించారు. తాము హెచ్చ‌రించేవ‌ర‌కు ఎవ‌రూ గంగాన‌ది నీటిని తాగొద్ద‌ని బిహార్‌, యూపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాయి. మ‌రి గంగా న‌ది కూడా అప‌విత్రం అయిపోయిందా? క‌రోనా సోకిందా? చూడాలి ఏం జ‌రుగుతుందో.

This post was last modified on May 10, 2021 4:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago