పవిత్ర గంగా నదికి కూడా కరోనా సోకిందా? హిందూ సామాజిక వర్గాలు.. అత్యంత పవిత్రంగా భావించే గంగానది నీరు కూడా ఇప్పుడు నిరుపయోగంగా అత్యంత ప్రమాదకరంగా మారిపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు ఉత్తరప్రదేశ్ మునిసిపాలిటీ అధికారులు. గంగా నది ప్రవాహం ఎక్కువగా ఉన్న యూపీలో ఇప్పుడు గంగా నదికి కూడా కరోనా ప్రభావం సోకిందనే ప్రచారం.. తీవ్ర కలకలం రేపుతోంది. వారణాసి సహా అనే ప్రాంతాల్లో ప్రవహించే గంగా నది నీటిని.. యూపీలో జనావాసాలకు కూడా సరఫరా చేస్తారు.
ఈ నీటినే తాగేందుకు, సాగుకు కూడా వినియోగిస్తారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ గంగా నదికి కూడా కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో జోరు ప్రచారం సాగుతుండగా.. అధికారులు దీనిని ఇంకా నిర్ధారించ లేదని.. అయితే.. ప్రమాదం మాత్రం పొంచి ఉందని అంటున్నారు. దీనికి కారణాలపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఇప్పటికిప్పుడు అందిన సమాచారం ప్రకారం.. యూపీ, బిహార్లో ప్రవహించే గంగా నదికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరు ముక్తి ధామాల్లో గంగా నది కూడా ఒకటి.
అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక అని ఆరు ముక్తి ధామాలను శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వీటిలో మరణించడం కానీ, మరణించిన వారి మృతదేహాలకు ఈ ఆరు ప్రదేశాల్లో ఎక్కడైనా అంతిమ సం స్కారం చేయడం వల్ల కానీ.. ముక్తి లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే ఇటీవల 15 రోజులుగా యూపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారి భౌతిక దేహాలను గంగా నదిలో గుట్టు చప్పుడు కాకుండా కలిపేస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండానే సాగుతున్న ఈ క్రతువులపై అక్కడి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం నిషేధం విధించింది.
అయితే.. తాజాగా ఇప్పుడు గంగా నది ఒడ్డుకు.. 50 మృత దేహాలు కొట్టుకు వచ్చాయి. బిహార్లోని బక్సర్ జిల్లాలో జరిగిన ఈఘటన తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాదేవ్ ఘాట్ సమీపంలో ఒక్క కిలోమీటరు పరిధిలోనే 48 శవాలు కనిపించాయి. చాలా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నాయి.
కరోనాతో చనిపోయినవారిని తమ బంధువులే ఇలా గంగా నదిలో పడేశారని సమాచారం అందడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. గంగా నది నీటి శాంపిళ్లను ప్రయోగశాలలకు పంపించారు. తాము హెచ్చరించేవరకు ఎవరూ గంగానది నీటిని తాగొద్దని బిహార్, యూపీ ప్రభుత్వం ప్రకటించాయి. మరి గంగా నది కూడా అపవిత్రం అయిపోయిందా? కరోనా సోకిందా? చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on May 10, 2021 4:33 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…