Political News

కొండా సంచ‌ల‌నం…ట‌చ్ లో ఇద్ద‌రు మంత్రులు స‌హా రేవంత్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో రోజుకో కొత్త ఈక్వేష‌న్ ఎంట్రీ ఇస్తోంది. ఈ కొత్త ఈక్వేష‌న్లు వ‌ర్క‌వుట్ అవుతాయా? లేదా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే… రాష్ట్ర రాజ‌కీయాల్లో మాత్రం స‌రికొత్త చ‌ర్చ‌కు మాత్రం తెర లేపుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య ష‌ర్మిల కొత్త పార్టీ పేరిట ఎంట్రీ ఇవ్వ‌గా… తాజాగా టీఆర్ఎస్ కు దూర‌మైపోయిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తో క‌లిసి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి స‌రికొత్త రాజ‌కీయం చేయ‌నున్న‌ట్లుగా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ దిశ‌గా ఇప్పుడు మ‌రో కొత్త ఈక్వేష‌న్ కూడా ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచే వేరుప‌డిన ఈట‌ల‌, కొండాల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నార‌ట‌. అంతేకాకుండా కేసీఆర్ కేబినెట్ లోని ఇద్ద‌రు మంత్రులు కూడా ఈ కొత్త శిబిరంతో ట‌చ్ లోకి వ‌చ్చార‌ట‌.

ఈ ఈక్వేష‌న్ ను ఎవ‌రో రాజ‌కీయ విశ్లేష‌కుడో, ఏ మీడియా సంస్థ‌నో ఊహించింది కాదు. స్వ‌యంగా కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డే ఈ ఈక్వేష‌న్ ను వెల్ల‌డించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా విశ్వేశ్వ‌రెడ్డి ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ఈ దిశ‌గా కొండా ఏమ‌న్నారంటే… తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయపార్టీ అవసరముందని కొండా అభిప్రాయప‌డ్డారు. అటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల మరికొంత మంది ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

కేసీఆర్‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కొండా…కేసీఆర్‌ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు తమతో టచ్‌లో ఉన్నారని స‌రికొత్త బాంబు పేల్చారు. టీఆర్ఎస్‌పై పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్‌, బీజేపీలు లేవన్నారు. తమ ఆలోచనలకు రేవంత్‌రెడ్డి మద్దతు కూడా ఉందని చెప్పారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. షర్మిలకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని అనుకోవడంలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

This post was last modified on May 10, 2021 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

31 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

33 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

1 hour ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago