పోయినేడాది ఇదే సమయానికి తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసేయడంతో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అటు వెళ్లలేక.. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్లు ఇటు రాలేక నానా అవస్థలు పడ్డారు. కొన్ని రోజులే ఉంటుందనుకున్న లాక్ డౌన్ నెలల తరబడి కొనసాగడంతో ఎక్కడి వాళ్లు అక్కడ ఇరుక్కుపోయి స్వస్థలాలకు వెళ్లలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సౌకర్యాలు పూర్తిగా ఆగిపోగా.. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో మాత్రమే రాకపోకలు సాగించారు.
ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చే వాహనాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం తెలిసిందే. కర్నూలు, విజయవాడ బోర్డర్ల వద్ద వందలాదిగా వాహనాలు ఆగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ సమయంలోనే ఈ-పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. అందులో రిజిస్టర్ అయి ఈపాస్ పొందిన వాహనాలకు మాత్రమే రాకపోకలకు అనుమతులిచ్చారు.
కొన్ని నెలల తర్వాత ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ షరతులు తొలగిపోవడంతో ఈ-పాస్ అవసరం లేకపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ-పాస్ను అమల్లోకి తెచ్చింది ఏపీ సర్కారు. ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. మిగతా సమయమంతా కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఆరు గంటలు మినహాయించి లాక్ డౌన్ అమలవుతున్నట్లే అన్నమాట. ఈ నెల 18 వరకు ఈ షరతులు కొనసాగనున్నాయి. అప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు నేరుగా అనుమతులు ఉండవు.
ఏపీలోకి రావడానికి, ఇక్కడ ప్రయాణించడానికి కారణం వివరిస్తూ ముందస్తుగా అనుమతి పొంది.. ఈ-పాస్ చేతిలో పెట్టుకుంటే తప్ప వాహనాలకు అనుమతులు ఉండవు. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించని నేపథ్యంలో ఈ నెల 18 తర్వాత కూడా కర్ఫ్యూను కొనసాగించడం, ఈ-పాస్ తప్పనిసరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవాళ్లు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకుని ఈ-పాస్ తీసుకోవడం మరిచిపోరాదు.
This post was last modified on May 10, 2021 9:09 am
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…