Political News

ఏపీకి వెళ్లాలా.. మళ్లీ అది ఉండాల్సిందే

పోయినేడాది ఇదే సమయానికి తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసేయడంతో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అటు వెళ్లలేక.. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్లు ఇటు రాలేక నానా అవస్థలు పడ్డారు. కొన్ని రోజులే ఉంటుందనుకున్న లాక్ డౌన్ నెలల తరబడి కొనసాగడంతో ఎక్కడి వాళ్లు అక్కడ ఇరుక్కుపోయి స్వస్థలాలకు వెళ్లలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సౌకర్యాలు పూర్తిగా ఆగిపోగా.. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో మాత్రమే రాకపోకలు సాగించారు.

ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చే వాహనాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం తెలిసిందే. కర్నూలు, విజయవాడ బోర్డర్ల వద్ద వందలాదిగా వాహనాలు ఆగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ సమయంలోనే ఈ-పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. అందులో రిజిస్టర్ అయి ఈపాస్ పొందిన వాహనాలకు మాత్రమే రాకపోకలకు అనుమతులిచ్చారు.

కొన్ని నెలల తర్వాత ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ షరతులు తొలగిపోవడంతో ఈ-పాస్ అవసరం లేకపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ-పాస్‌ను అమల్లోకి తెచ్చింది ఏపీ సర్కారు. ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. మిగతా సమయమంతా కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఆరు గంటలు మినహాయించి లాక్ డౌన్ అమలవుతున్నట్లే అన్నమాట. ఈ నెల 18 వరకు ఈ షరతులు కొనసాగనున్నాయి. అప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు నేరుగా అనుమతులు ఉండవు.

ఏపీలోకి రావడానికి, ఇక్కడ ప్రయాణించడానికి కారణం వివరిస్తూ ముందస్తుగా అనుమతి పొంది.. ఈ-పాస్ చేతిలో పెట్టుకుంటే తప్ప వాహనాలకు అనుమతులు ఉండవు. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించని నేపథ్యంలో ఈ నెల 18 తర్వాత కూడా కర్ఫ్యూను కొనసాగించడం, ఈ-పాస్ తప్పనిసరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవాళ్లు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకుని ఈ-పాస్ తీసుకోవడం మరిచిపోరాదు.

This post was last modified on May 10, 2021 9:09 am

Share
Show comments
Published by
satya

Recent Posts

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

52 mins ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

56 mins ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

2 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

3 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

4 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

4 hours ago