పోయినేడాది ఇదే సమయానికి తెలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసేయడంతో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అటు వెళ్లలేక.. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్లు ఇటు రాలేక నానా అవస్థలు పడ్డారు. కొన్ని రోజులే ఉంటుందనుకున్న లాక్ డౌన్ నెలల తరబడి కొనసాగడంతో ఎక్కడి వాళ్లు అక్కడ ఇరుక్కుపోయి స్వస్థలాలకు వెళ్లలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సౌకర్యాలు పూర్తిగా ఆగిపోగా.. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో మాత్రమే రాకపోకలు సాగించారు.
ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చే వాహనాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం తెలిసిందే. కర్నూలు, విజయవాడ బోర్డర్ల వద్ద వందలాదిగా వాహనాలు ఆగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ సమయంలోనే ఈ-పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. అందులో రిజిస్టర్ అయి ఈపాస్ పొందిన వాహనాలకు మాత్రమే రాకపోకలకు అనుమతులిచ్చారు.
కొన్ని నెలల తర్వాత ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ షరతులు తొలగిపోవడంతో ఈ-పాస్ అవసరం లేకపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ-పాస్ను అమల్లోకి తెచ్చింది ఏపీ సర్కారు. ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. మిగతా సమయమంతా కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఆరు గంటలు మినహాయించి లాక్ డౌన్ అమలవుతున్నట్లే అన్నమాట. ఈ నెల 18 వరకు ఈ షరతులు కొనసాగనున్నాయి. అప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు నేరుగా అనుమతులు ఉండవు.
ఏపీలోకి రావడానికి, ఇక్కడ ప్రయాణించడానికి కారణం వివరిస్తూ ముందస్తుగా అనుమతి పొంది.. ఈ-పాస్ చేతిలో పెట్టుకుంటే తప్ప వాహనాలకు అనుమతులు ఉండవు. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించని నేపథ్యంలో ఈ నెల 18 తర్వాత కూడా కర్ఫ్యూను కొనసాగించడం, ఈ-పాస్ తప్పనిసరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవాళ్లు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకుని ఈ-పాస్ తీసుకోవడం మరిచిపోరాదు.
This post was last modified on May 10, 2021 9:09 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…