Political News

వామన్ రావు హత్య కేసులో ఈటల బుక్కైనట్టేనా?

ఈట‌ల రాజేంద‌ర్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా వినిపిస్తున్న పేరు. టీఆర్ఎస్ నేత‌గా, తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈట‌ల‌… ఒక్క‌సారిగా కేసీఆర్ ఆగ్ర‌హానికి గురైపోయారు. దేవ‌ర‌యాంజ‌ల్ భూముల కేసులో ఇప్ప‌టికే బుక్కైపోయిన ఈట‌ల‌పై మ‌రో కీల‌క కేసు న‌మోదు కానుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేకెత్తించిన న్యాయ‌వాది వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఇప్పుడు ఈట‌ల పేరు కూడా నిందితుల జాబితాలో చేరిపోయేందుకు దాదాపుగా రంగం సిద్ధం అయిపోయింద‌నే చెప్పాలి. శ‌నివారం వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే… ఈ విష‌యం బోధ‌ప‌డుతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే… వామ‌న్ రావు దంప‌తుల‌పై దాడి చేసిన కొంద‌రు దుండ‌గులు వారిద్ద‌రినీ అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ పుట్ట మ‌ధు సూత్ర‌ధారి అని, త‌న‌ను అన‌వ‌స‌ర‌మైన కేసుల‌తో వేధిస్తున్నార‌న్న భావ‌న‌తో వామ‌న్ రావును పుట్ట మ‌ధు హ‌త్య చేయించార‌న్న‌ది కీల‌క ఆరోప‌ణ‌. ఈ కేసులో ఓ ద‌ఫా పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన మ‌ధు,… ఆ త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే వారం పాటు మ‌ధు కోసం అంత‌గా ప‌ట్టింపు లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన తెలంగాణ పోలీసులు గ‌డ‌చిన రెండు, మూడు రోజులుగా కాస్తంత గ‌ట్టి నిఘానే పెట్టారు. ఈ క్ర‌మంలో ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో త‌ల‌దాచుకున్న పుట్ట మ‌ధును ఎట్ట‌కేల‌కు ప‌ట్టేశారు. భీమ‌వ‌రం నుంచి మ‌ధును హైద‌రాబాద్ త‌ర‌లించిన పోలీసులు ఆయ‌న‌ను త‌మ‌దైన శైలిలో విచారిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే.. పుట్ట మ‌ధు పోలీసుల‌కు చిక్కిన రోజే వామ‌న్ రావు తండ్రి కిష‌న్ రావు మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న కొడుకు, కోడ‌లుపై దాడి జ‌రిగిన త‌ర్వాత వారిద్ద‌రినీ స‌కాలంలోనే ఆసుప‌త్రికి త‌ర‌లించినా… ఆసుప‌త్రిలో స‌కాలంలో వారికి వైద్యం అంద‌లేద‌ని, ఇందుకు నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌రే కార‌ణ‌మ‌ని కూడా కిష‌న్ రావు ఆరోపిస్తున్నారు. ఈట‌ల ఆదేశాల‌తోనే వైద్యులు త‌న కొడుకు, కోడ‌లుకు వైద్యం అందించ‌లేద‌ని, దీంతో దాడికి గురైన వారిద్ద‌రూ చ‌నిపోయార‌ని ఆయ‌న ఆరోపించారు. మొత్తంగా వామ‌న్ రావు దంప‌తుల హ‌త్యోదంతంలో ఈట‌ల పేరును కిష‌న్ రావు చేర్చేశారు. ఇలా శ‌నివారం వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాలు బ‌ట్టి చూస్తే… ఇప్ప‌టికే కేసీఆర్ ఆగ్ర‌హానికి గురై కేబినెట్ నుంచి ఉద్వాస‌న‌కు గురైన ఈట‌ల‌పై వామ‌న్ రావు దంపతుల హ‌త్య కేసు కూడా న‌మోదు కానుంద‌న్న వాద‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి.

This post was last modified on May 9, 2021 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago