Political News

ఏపీ బీజేపీకి బాబే సీఎం.. టీడీపీనే అధికార పార్టీ..!

రాష్ట్ర బీజేపీలో ఒక విధానం అంటూ లేద‌నే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా మారిపోయింది. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తారో.. ఎలాంటి రాజ‌కీయాలు చేస్తారో.. ఎవ‌రిని తొక్కేస్తారో.. ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఏపీలో బీజేపీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ.. అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేస్తుంది. అధికార పార్టీలో ఉన్న నేత‌ల ఆగ‌డాలు, అక్ర‌మాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని.. విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది.

ఇదే స‌హ‌జంగా ఏ పార్టీ అయినా.. ఏరాష్ట్రంలో అయినా చేసే ప‌ని. ఈ ప‌ద్ధతి కొన్నాళ్లు ఏపీ బీజేపీలోనూ సాగింది. ఒక్క సీటు కూడా గెల‌వ‌క‌పోయినా.. అధికారంలో ఉన్న వైసీపీని నిత్యం విమ‌ర్శ‌ల‌తో ముంచెత్తారు.. గ‌త అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఇసుక అక్ర‌మాలు, మ‌ద్యం విధానం.. ఇలా అనేక విష‌యాల‌ను ఆయ‌న టార్గెట్ చేసుకుని వైసీపీ నేత‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేశారు. అయితే.. త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన సోము వీర్రాజు మాత్రం.. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లు పెట్టారు. వైసీపీని పొగ‌డ‌క‌పోయినా.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీని మాత్ర‌మే తిట్టిపోయ‌డంగా ముందుకు సాగారు.

ఈ విష‌యం పార్టీలోను, ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో బీజేపీ.. నేత‌లు వైసీపీకి బీ-టీంగా మారిపోయార‌నే కామెంట్లు కూడా వినిపించాయి. మ‌రికొంద‌రు కేంద్రంలోని పెద్ద‌లు ఇదే విష‌యం చెప్పి ఉంటార‌ని అందుకే అలా చేస్తున్నార‌ని అన్నారు. ఇదే నిజం అనుకున్నా.. తిరుప‌తి ఉప ఎన్నిక వ‌చ్చే స‌రికి కేంద్రంలోని పెద్ద‌లు కూడా యూట‌ర్న్ తీసుకుని.. రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. కానీ, సోము ఆయ‌న ప‌రివారం మాత్రం వైసీపీని ఒక్క‌మాట కూడా అన‌లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ టీడీపీని టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

చంద్ర‌బాబు చేసింది ఏమీలేద‌న్నారు. తిరుప‌తి అభివృద్దికి తామే నిధులు ఇచ్చామ‌ని చెప్పారు. అంటే.. చంద్ర‌బాబే సీఎం అని.. టీడీపీనే అధికారంలో ఉంద‌నే భావ‌న‌తో తీవ్రంగా దుయ్య‌బట్టారు. అంతేత‌ప్ప‌.. వైసీపీ పాల‌న‌పై నామ‌మాత్రంగా అది కూడా ప్ర‌ధాన మీడియా కంట ప‌డ‌కుండా తూతూ మంత్రంగా విమ‌ర్శ‌లు చేశారు. ఫ‌లితంగా ఇక్క‌డ డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇదే ప‌రిస్థితిని కొన‌సాగిస్తారా? లేక పంథాను మార్చుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. పంథా మార్చుకోక పోతే.. పూర్తిగా తుడిచి పెట్టుకుని పోవ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 9, 2021 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు బాస్

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

1 hour ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

1 hour ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

4 hours ago

అవును… కళ్యాణ్ రామ్ సరసన ఆమెనే

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…

6 hours ago

పో* వెబ్ సైట్లో ఫొటో… జాన్వి షాక్

ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…

6 hours ago