Political News

ఏపీ బీజేపీకి బాబే సీఎం.. టీడీపీనే అధికార పార్టీ..!

రాష్ట్ర బీజేపీలో ఒక విధానం అంటూ లేద‌నే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా మారిపోయింది. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తారో.. ఎలాంటి రాజ‌కీయాలు చేస్తారో.. ఎవ‌రిని తొక్కేస్తారో.. ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఏపీలో బీజేపీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ.. అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేస్తుంది. అధికార పార్టీలో ఉన్న నేత‌ల ఆగ‌డాలు, అక్ర‌మాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని.. విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది.

ఇదే స‌హ‌జంగా ఏ పార్టీ అయినా.. ఏరాష్ట్రంలో అయినా చేసే ప‌ని. ఈ ప‌ద్ధతి కొన్నాళ్లు ఏపీ బీజేపీలోనూ సాగింది. ఒక్క సీటు కూడా గెల‌వ‌క‌పోయినా.. అధికారంలో ఉన్న వైసీపీని నిత్యం విమ‌ర్శ‌ల‌తో ముంచెత్తారు.. గ‌త అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఇసుక అక్ర‌మాలు, మ‌ద్యం విధానం.. ఇలా అనేక విష‌యాల‌ను ఆయ‌న టార్గెట్ చేసుకుని వైసీపీ నేత‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేశారు. అయితే.. త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన సోము వీర్రాజు మాత్రం.. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లు పెట్టారు. వైసీపీని పొగ‌డ‌క‌పోయినా.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీని మాత్ర‌మే తిట్టిపోయ‌డంగా ముందుకు సాగారు.

ఈ విష‌యం పార్టీలోను, ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో బీజేపీ.. నేత‌లు వైసీపీకి బీ-టీంగా మారిపోయార‌నే కామెంట్లు కూడా వినిపించాయి. మ‌రికొంద‌రు కేంద్రంలోని పెద్ద‌లు ఇదే విష‌యం చెప్పి ఉంటార‌ని అందుకే అలా చేస్తున్నార‌ని అన్నారు. ఇదే నిజం అనుకున్నా.. తిరుప‌తి ఉప ఎన్నిక వ‌చ్చే స‌రికి కేంద్రంలోని పెద్ద‌లు కూడా యూట‌ర్న్ తీసుకుని.. రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. కానీ, సోము ఆయ‌న ప‌రివారం మాత్రం వైసీపీని ఒక్క‌మాట కూడా అన‌లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ టీడీపీని టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

చంద్ర‌బాబు చేసింది ఏమీలేద‌న్నారు. తిరుప‌తి అభివృద్దికి తామే నిధులు ఇచ్చామ‌ని చెప్పారు. అంటే.. చంద్ర‌బాబే సీఎం అని.. టీడీపీనే అధికారంలో ఉంద‌నే భావ‌న‌తో తీవ్రంగా దుయ్య‌బట్టారు. అంతేత‌ప్ప‌.. వైసీపీ పాల‌న‌పై నామ‌మాత్రంగా అది కూడా ప్ర‌ధాన మీడియా కంట ప‌డ‌కుండా తూతూ మంత్రంగా విమ‌ర్శ‌లు చేశారు. ఫ‌లితంగా ఇక్క‌డ డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇదే ప‌రిస్థితిని కొన‌సాగిస్తారా? లేక పంథాను మార్చుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. పంథా మార్చుకోక పోతే.. పూర్తిగా తుడిచి పెట్టుకుని పోవ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 9, 2021 11:27 am

Share
Show comments
Published by
satya

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

32 mins ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

40 mins ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

1 hour ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

2 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

2 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

3 hours ago