మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్పై డి.హీరేహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ట్విటర్లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. వివరాలు… టీడీపీ కార్యకర్త మారుతిపై కర్ణాటకలో కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే, దీని వెనుక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారంటూ.. నారా లోకేశ్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. వెంటనే స్పందించిన భోజరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు.. హుటాహుటిన ఆగమేఘాలపై స్పందించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించారని నారా లోకేశ్పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు.. అదికార పార్టీకి కూడా నష్టం కలిగించేందుకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ కేసు నమోదుపై.. టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు బనాయించే అక్రమ కేసులకు భయపడేది లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే మారుతిపై జరిగిన దాడిని లోకేశ్ ఖండిస్తే, ఆయనపై అక్రమ కేసు పెట్టారని కాల్వ ఆరోపించారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా వనరులను కొల్లగొడుతున్నా రని మండిపడ్డారు. దుర్మార్గాలను ప్రశ్నిస్తే, దాడులు చేసి అక్రమ కేసుల్లో ఇరికించడం అధికార పార్టీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. డి.హీరేహాళ్ మండలంలో వైసీపీ నాయకుల దోపిడీని త్వరలోనే ప్రజలముందు పెడతామని ఆయన చెప్పారు. తప్పుడు కేసులను తిప్పికొడుతూనే దొంగల ముఠా అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు.
లోకేష్ రియాక్షన్ ఇదీ..
తనపై నమోదు చేసిన కేసు విషయంలో నారా లోకేష్ ట్విట్టర్లో దీటుగా స్పందించారు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…